మరో వారం రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 సమరం ఆరంభంకానుంది. ప్రధాన జట్లు భారత్, పాకిస్తాన్ టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక, బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా టైటిల్ రేసులో ఉన్నాయి. మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఈనెల 27న ప్రారంభం కానుంది. ఇప్పటికే,ఆయా జట్లన్నీ తమ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీలో ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శన చేసిన జట్లు ఏవీ? భారత ట్రాక్ రికార్డ్ ఏవిధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం.. ఆసియా కప్ టోర్నీలోఅత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. 1984 నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో 14 ఎడిషన్లు పూర్తవగా.. ఇందులో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. ఇక, పాకిస్తాన్ 5, శ్రీలంక 2 సార్లు విజయం సాధించాయి. ఇక మ్యాచుల విషయానికొస్తే.. భారత జట్టు ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచ్లు ఆడగా.. అందులో 36 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్లో ఎలాంటి ఫలితం తేలకపోగా.. అఫ్ఘనిస్తాన్పై మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఒకప్పుడు పటిష్టమైన టీంతో అదరగొట్టిన శ్రీలంకకు కూడా ఆసియా కప్లో చక్కటి ట్రాక్ రికార్డ్ ఉంది. భారత్తో సమానంగా 54 మ్యాచ్లు ఆడగా అందులో 35 గెలుపులు ఉన్నాయి. భారత్ కంటే ఒక్క విజయమే శ్రీలంకకు తక్కువగా ఉంది. ఇక పాకిస్తాన్ మొత్తం 49 మ్యాచ్లు ఆడి 28 విజయాలు సాధించింది. 2000, 2012 ఎడిషన్లలో 2 సార్లు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇక, బంగ్లాదేశ్ ఇప్పటివరకు మొత్తం 48 మ్యాచ్లు ఆడగా అందులో 10 విజయాలు సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చివరి నాలుగు ఎడిషన్లలో 3 ఫైనల్స్ ఆడింది. అలాగే.. మరికొన్ని ట్రాక్ రికార్డులు మీకోసం.. ఆసియా కప్లో 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత జట్టు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెటర్ సనన్ జయసూర్య కొనసాగుతున్నాడు. 25 మ్యాచుల్లో 53 సగటుతో 1,220 పరుగులు చేశాడు. అదే సమయంలో దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. 21 మ్యాచ్లు ఆడి 971 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 24 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు. అదే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్లో భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 12 మ్యాచ్ల్లో 22 వికెట్లు తీశాడు. అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సనత్ జయసూర్య పేరిట ఉంది. 25 మ్యాచ్ల్లో 6 సెంచరీలు చేశాడు. ఆసియా కప్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ పేరిట నమోదైంది. 2008లో భారత్పై 13 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఇదీ చదవండి: Asia Cup 2022 Predictions: ‘ఖచ్చితంగా ఆ జట్టుదే ట్రోఫీ..’ పాక్ మాజీ కెప్టెన్ జోస్యం! ఇదీ చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ టీమ్లో ఆ ప్లేయర్ అవసరమా? లాబీయింగ్ జరిగిందా?