టీమిండియా సీనియర్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. యువ క్రికెటర్ కేఎస్ భరత్పై గట్టి వార్నింగ్ ఇచ్చాడు. చేసిన తప్పుకు సారీ చెప్పాలని గ్రౌండ్లేనే భరత్ను ఆదేశించాడు. ఇంతకు ఏం జరిగిందంటే..
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ క్రికెటర్, వికెట్ కీపర్ కేఎస్ భరత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సారీ చెప్పాలంటూ భరత్కు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా అహ్మాదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించుకుంది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 255 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో చెలరేగాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్లో అద్భుతంగా ఆడుతూ ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టీమిండియా టాప్ క్లాస్ బౌలర్లను సైతం సాలిడ్ డిఫెన్స్తో అడ్డుకున్నాడు. ఖవాజా బ్యాటింగ్తో టీమిండియా బౌలర్లే కాకుండా ఫీల్డర్లు సైతం అలసిపోయారు. ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్.. ఖవాజాను బాల్ తీసుకొని కొట్టాడు. షమీ బౌలింగ్లో డెడ్లీ బౌన్సర్ను తప్పించుకునే క్రమంలో ఖవాజా క్రీజ్లో బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు. తిరిగి లేస్తున్న క్రమంలో ఖవాజా క్రీజ్ బయటికి వెళ్లి ఉంటాడని భావించిన భరత్.. వికెట్లకు త్రో వేశాడు. అది కాస్త మిస్ ఫైర్ అయి.. నేరుగా వెళ్లి ఖవాజా కాలికి తగిలింది. బాల్ దెబ్బను ఊహించని ఖవాజా షాక్ అవుతూ.. భరత్ వైపు చూశాడు. పక్కనే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. భరత్ చేసిన పనికి షాక్ అయ్యాడు. అయితే.. యువ క్రికెటర్ భరత్ పొరపాటున కొట్టినా.. బ్యాటర్ను బాల్తో కొట్టడం తప్పేనని భరత్ను వారించి, ఖవాజాకు సారీ చెప్పాలని కోరాడు. కోహ్లీ లాంటి వ్యక్తి చెప్పడంతో తాను కావాలని కొట్టలేదని భరత్ నవ్వుతూ సారీ చెప్పడంతో ఖవాజా సైతం చిరునవ్వుతో ప్రతిస్పందించాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— MAHARAJ JI (@MAHARAJ96620593) March 9, 2023