డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత తొలిసారి టీమిండియా విండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడబోతుంది. ఇప్పటికే విండీస్ చేరుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన టీమిండియాకి విండీస్ దిగ్గజం సర్ ప్రైజ్ ఇచ్చాడు.
విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ 20 లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం విండీస్ కి చేరుకున్న భారత జట్టు ఈ నెల 12 న జరిగే మొదటి టెస్టు కోసం సిద్దమవుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ టెస్టు సిరీస్ కి పుజారాను తప్పించి తొలిసారి జైస్వాల్, గైక్వాడ్ లను జట్టులోకి తీసుకోవడం విశేషం. టెస్టు జరగడానికి మరో వారం సమయం ఉండడంతో భారత ఆటగాళ్లు ఛిల్ అవుతూ కనిపించారు. ఈ క్రమంలోనే విండీస్ లెజెండరీ ఆల్ రౌండర్ గ్యారీ సోబర్స్ ని కలిసి సర్ ప్రైజ్ చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సోబర్స్ తో కలిసి దిగిన ఫోటో అభిమానులకి కన్నుల విందుగా అనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విండీస్ గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ గ్యారీ సోబర్స్ అంటే ఇప్పటి జెనరేషన్ కి తెలియకపోయినా అప్పట్లో ఒక సెన్సేషన్. బ్యాటింగ్ బౌలింగ్ లో అసాధారణ ప్రతిభ చూపిస్తూ క్రికెట్ లో తనకంటూ చరిత్రలోనే వన్ ఆఫ్ ది ఆల్ టైం ఆల్ రౌండర్స్ లో ఒకడిగా నిలిచాడు. 93 టెస్టులు ఆడిన సోబర్స్ 8 వేలకు పైగా పరుగులు చేసాడు. యావరేజ్ 57 ఉండడం విశేషం. ఇక 235 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డ్ ఈ లెజెండరీ పేరిట ఉండడం విశేషం. ఇంతటి ఘన కీర్తి కలిగిన గ్యారీ సోబర్స్ ని కలుసుకునే అదృష్టం టీమిండియా క్రికెటర్లకు కలిగింది. సోబర్స్ దంపతులిద్దరూ స్వయంగా భారత శిభిరం వద్దకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని కరీబియాన్ క్రికెట్ పాడ్ కాస్ట్ షేర్ చేసింది. మొత్తానికి విండీస్ లెజెండరీ ఆల్ రౌండర్ టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలుసుకోవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Virat Kohli meeting Sir Gary Sobers.
A wonderful video! pic.twitter.com/6OP1OhCKZd
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2023