బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆసిస్ మధ్య రెండో టెస్ట్ శుక్రవారం(ఫిబ్రవరి 17)న ప్రారంభం కానుంది. దాంతో ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన అనుభవాలను, విలువైన సలహాలను యంగ్ క్రికెటర్లకు ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన విషయం తెలిసిందే.ఇక ఎంతటి కఠినపరిస్థితుల్లోనైనా టీమ్ ను విజయతీరాలకు చేర్చడంలో కింగ్ విరాట్ కోహ్లీకి మించిన ఆటగాడు ప్రపంచ క్రికెట్ లోనే ఉండడు అనడంలో అతిశయోక్తి కాదు. మరి అలాంటి ఆటగాడి నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవాలని ఏ యంగ్ ప్లేయర్ అనుకోడు చెప్పండి. ఇక తన అనుభవాలను రాబోయే తరానికి చెప్పేవాడినే అసలైన నాయకుడు అంటారు. ప్రస్తుతం కోహ్లీ చేస్తున్న పని అదే. ఢిల్లీలోని యంగ్ క్రికెటర్లకు తన అనుభవాను నేర్పుతున్నాడు ఈ రన్ మెషిన్.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా-ఆసిస్ మధ్య రెండో టెస్ట్ శుక్రవారం(ఫిబ్రవరి 17)న ప్రారంభం కానుంది. దాంతో ఇరు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి చేరుకున్నాయి. ఇక ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ ను కూడా ప్రారంభించాయి. అందులో భాగంగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అనుభవాలను, విలువైన సలహాలను ఢిల్లీ యంగ్ క్రికెటర్లకు ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా.. ముగ్గురు యంగ్ క్రికెట్ ప్లేయర్స్ కు మైదానంలో టిప్స్ ను ఇస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మైదానంలో కఠిన పరిస్థితుల్లో ఎలా ముందుకు సాగాలో..ఒత్తిడిని జయించి జట్టుకు గెలుపును ఎలా అందించాలో లాంటి విలువైన సూచనలను వారికి ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
ఇక ఆసిస్ తో ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా సర్వం సిద్దమైంది. తొలి టెస్ట్ గెలిచి సిరీస్ లో 1-0తో ముందంజలో ఉంది భారత జట్టు. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి టోర్నీలో మరింత ముందుకు సాగాలని ఉవ్విళ్లూరుతోంది టీమిండియా. తొలి మ్యాచ్ లో అద్భత ప్రదర్శన చేసిన భారత బౌలర్లు.. ఈ మ్యాచ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. మరి యంగ్ ప్లేయర్స్ కు విలువైన సలహాలు ఇస్తున్న విరాట్ కోహ్లీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli giving guidance to young cricketers in Delhi. (📷 – PTI) pic.twitter.com/F55yZG68WZ
— Johns. (@CricCrazyJohns) February 16, 2023