రన్నింగ్ ట్రాక్పై చిరుత వేగంతో పరిగెత్తే ఉసేన్ బోల్ట్ అందరికీ సుపరిచతమే. ఏకంగా ఎనిమిది సార్లు గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు. బోల్ట్కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాగా.. రన్నింగ్ పోటీలకు గుడ్బై చెప్పేసిన బోల్ట్ మరో క్రేజీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలోనే ఉసేస్ బోల్ట్ ఫ్రొఫెసనల్ క్రికెటర్గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే క్రికెటర్గా మారేందుకు బోల్ట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. కాగా ఉసేన్ బోల్ట్ కు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం కానీ.. అతను అథ్లెట్గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రాక్కు పూర్తిగా దూరమైన బోల్ట్ క్రికెట్పై దృష్టిపెట్టాడు. త్వరలో ఒక ప్రతిష్టాత్మక లీగ్లో ఉసేన్ ఆడనున్నాడు. విశేషం ఏమిటంటే.. ఉసేన్ క్రికెట్ ఆడేది ఇండియాలోనే.
ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ పవర్ స్పోర్ట్స్ర్ ఆధ్వర్యంలో గ్లోబల్ టీ20 లీగ్ను ఢిల్లీలో నిర్వహించనుంది. యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో అక్టోబర్ 2 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. అందులో ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ లీగ్లో టీమిండియా క్రికెటర్లు మున్నాఫ్ పటేల్, యూసుఫ్ పఠాన్తో పాటు శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్, ఇయాన్ బెల్, గుల్భాద్దిన్ నైబ్ వంటి స్టార్లు కూడా ఆడనున్నారు. మరి మనిషి రూపంలో ఉన్న చిరుతపులి లాంటి ఉసేన్ బోల్ట్ క్రికెట్లోకి అడుగుపెడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Widely regarded as the greatest sprinter of all time, Usain Bolt could soon be seen playing cricket in India in the Global Power Cricket League. @powersportz_tvhttps://t.co/FHsriHeVtt
— Circle of Cricket (@circleofcricket) September 16, 2022
ఇది కూడా చదవండి: వెంకటేశ్ అయ్యర్ను బౌలర్ ఎందుకు కొట్టాడు? ఇప్పుడు అయ్యర్ పరిస్థితి ఎలా ఉందంటే?