కార్తీక్ త్యాగి.. ఒక్క ఓవర్తో ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. గెలుపు ఖాయం అనుకున్న పంజాగ్స్ కింగ్స్ను ఖంగుతినిపిస్తూ.. ఓటమి తప్పదనుకున్న రాజస్థాన్ రాయల్స్ను ఆశ్చర్యపరుస్తూ హీరో అయిపోయాడు. ఆఖరి ఓవర్లో ప్రత్యర్థికి కేవలం నాలుగు పరుగులే అవసరం, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి, క్రీజ్లో ఇద్దరు హార్డ్ హిట్టర్లు ఉన్నారు అయినా కూడా పట్టువదలకుండా కేవలం ఒకే ఒక్క రన్ ఇచ్చి రెండు వికెట్లు తీసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. చివరి ఓవర్ ఇంత అద్భుతంగా వేశాడు మోస్ట్ సీనియర్ బౌలర్ అనుకునేరూ జస్ట్ 20 ఏళ్ల కుర్రాడు. గతేడాదే ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు.
నవంబర్ 8, 2000వ సంవత్సరంలో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం, హపూర్ టౌన్ ధనౌరా గ్రామంలో జన్మించిన త్యాగి చెందిన త్యాగి 2017లో రంజీట్రోఫీలో యూపీ తరఫున ఆడాడు. 2018లో విజయ్ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబర్చాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసే త్యాగి బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. పాత బంతి కూడా యార్కర్లను సంధించ గల నైపుణ్యం అతని సొంతం. 2020 అండర్-19 టీ20 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యాడు. అండర్ 19 వరల్డ్ కప్లో అతని అద్భుత ప్రదర్శన చూసి అదే ఏడాది ఐపీఎల్ వేలం రూ.1.3 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అతన్ని కొనుగోలు చేసింది. అక్టోబర్ 6, 2020న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి పర్వాలేదనిపించాడు.
ఇప్పటి వరకు 12 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన త్యాగి 277 బంతులు విసిరి 428 పరుగులు ఇచ్చాడు. 12 వికెట్లు తీసుకున్నాడు. అతని ఫస్ట్ ఐపీఎల్ వికెట్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డీ కాక్. మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ అయితే అతని కెరీర్ మొత్తంలో గుర్తుండిపోయే మ్యాచ్. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి కీలకమైన మ్యాచ్ విన్నింగ్ వికెట్లు 2 తీసుకున్నాడు. పంజాబ్తో మ్యాచ్లో వేసిన లాస్ట్ ఓవర్తో మొత్తం క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. టీమిండియాకు మరో యంగ్ బౌలర్ దొరికినట్టే.