ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమమైన ఆటగాళ్లను ఎంపిక చేస్తుంది ICC. దాన్నే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అంటారు. వరల్డ్ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ను వారి వారి ప్రతిభను బట్టి హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే 2022కు గాను ఐసీసీ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ను ఎంపిక చేసింది. ఈ సారి అందులో చోటు దక్కించుకోవడంలో విఫలం అయ్యారు టీమిండియా దిగ్గజాలు. హాల్ ఆఫ్ ఫేమ్ కు ఎంపిక కావాలని ప్రతీ క్రికెటర్ కలలు కంటుంటాడు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు మాజీ దిగ్గజాలను ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ల జాబితాలో చేర్చింది ఐసీసీ. అందులో పాకిస్థాన్ కు చెందిన వెంటరన్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్, వెస్టిండీస్ దిగ్గజం శివ్ నరైన్ చందర్ పాల్ లను ఎంపిక చేసింది. వీరికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ గా హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోవాలని ప్రతీ ఒక్క క్రికెటర్ కు ఉంటుంది. కానీ ఆ అవకాశం అందరి ప్లేయర్లకు రాదు. ఈ క్రమంలోనే 2022కు గాను గ్రేటెస్ట్ ప్లేయర్లుగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి అడుగుపెట్టారు ముగ్గురు దిగ్గజాలు. అబ్దుల్ ఖాదిర్, ఎడ్వర్డ్, చందర్ పాల్ లను హాల్ ఆఫ్ ఫేమ్ వరించింది. ఈ సారి గ్రేటెస్ట్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకోవడంలో భారతీయ దిగ్గజాలు వెనక పడ్డారు.
అబ్దుల్ ఖాదిర్
పాకిస్థాన్ కు చెందిన ఈ వెంటరన్ స్పిన్నర్ 13 సంవత్సరాల దేశానికి ఎన్నో విజయాలను అందించాడు. అప్పట్లో ఖాదిర్ బౌలింగ్ స్టైల్ ఓ వింత. తనకే సాధ్యమైన వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను పడగొట్టేవాడు. అతడు బాల్ విసిరే విధానం, అతడి చూపు ను పసిగట్టడం బ్యాట్స్ మెన్ లకు చిక్కేది కాదు. పాక్ తరపున 67 టెస్ట్ మ్యాచ్ ల్లో 236 వికెట్లను పడగొట్టాడు. ఇక 104 వన్డేల్లో 132 వికెట్లు తీశాడు.”ఐసీసీ ఆల్ టైమ్ గ్రేటేస్ట్ ప్లేయర్స్ కుటుంబంలో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. మా నాన్న బతికుంటే ఈ విషయం తెలిసి ఎంతో గర్వపడే వాడు. నన్ను నామినేట్ చేసినందుకు ఐసీసీకి ధన్యవాదాలు” అంటూ అబ్దుల్ ఖాదిర్ అన్నాడు.
చార్లెట్ ఎడ్వర్డ్
ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్. అటు టాపార్డర్ బ్యాటర్ గా, ఇటు కెప్టెన్ న్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అదీ గాక మహిళా క్రికెట్ లో ఎన్నో వ్యక్తిగతమైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. తన కెరీర్ విషయానికి వస్తే.. 191 వన్డేల్లో 5992 పరుగులు చేసింది. 95 టీ20ల్లో 2605 రన్స్ చేసింది. టెస్ట్ ల్లో 1676 పరుగులతో సత్తా చాటింది.”ఈ సంతోష సమయాన్ని నేను నా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను. నా కెరీర్ ను గుర్తించి నాకు ఇంతటి గొప్ప అవార్డు ఇచ్చినందుకు ఐసీసీకి ధన్యవాదాలు” అంటూ ఎడ్వర్డ్ తన ఆనందాన్ని పంచుకుంది.
శివ్ నరైన్ చందర్ పాల్
వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ను ప్రపంచ చరిత్రలో ఓ దిగ్గజ జట్టుగా నిలపడంలో చందర్ పాల్ ది కీలక పాత్ర వహించాడు. తన 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో విండీస్ జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్భాంధవుడిలా ఆదుకునే వాడు. ఇక తన కెరీర్ లో 164 టెస్టుల్లో 30 సెంచరీలతో 11867 పరుగులు చేశాడు. 268 వన్డేల్లో 11 శతకాలతో 8778 రన్స్ చేశాడు.”ఇది నాకు లభించిన గొప్ప గౌరవం. దిగ్గజాల అడుగుజాడల్లో నిలవడం నిజంగా గొప్ప విజయం” చందర్ పాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
అయితే 2022లో హాల్ ఆఫ్ ఫేమ్ లో ఈ సారి టీమిండియా దిగ్గజాలకు చోటు దక్కలేదు. ఇది నిజంగా భారత అభిమానులకు చేదు వార్తే. ఈ క్రమంలో టీమిండియా తరపున గ్రేటెస్ట్ ప్లేయర్ల జాబితాలో.. బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009) ఒకే సంవత్సరం ఈ అవార్డుకు ఎంపికై రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018), క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ (2019) గాను హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు. అయితే హాల్ ఆఫ్ ఫేమ్ లో 28 ప్లేయర్లతో చోటు దక్కించుకుని అగ్రస్థానంలో ఉంది ఇంగ్లాండ్ జట్టు.
ICYMI, here are the three latest inductees into the ICC Hall of Fame 🌟https://t.co/CXb6Z2HSkn
— ICC (@ICC) November 8, 2022