టోక్యో ఒలంపిక్స్లో ఇండియాకు ఎలాగైన హాకీ టీమ్ స్వర్ణ పతాకాన్ని అందిస్తుందని అందరూ అనుకున్నారు. బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి సెమీస్లోకి దూసుకెళ్లింది. సెమీస్లోకి అడుగుపెట్టడంతో కొంగొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. ఇక్ దీంతో మొదట్లో భారత టీమ్ అనూహ్యంగా పుంజుకుని చివర్లో మాత్రం చితికిల పడింది. దీంతో భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. భారత హాకీ టీమ్లో సెమీస్లో భాగంగా ప్రపంచ నెంబర్ వన్ బెల్జియం హీకీ పురుషుల జట్టుతో తలపడింది. మొదట్లో గెలుస్తుందనే ఆశలు రేకిత్తాయి.
రెండు జట్ల మధ్య పోరు హోరా హోరిగా సాగింది. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక అనంతరం వరసగా రెండు గోల్స్ చేయటంతో దీంతో బెల్జియం జట్టు 4-2 తో ఆధిక్యంలోకి వెళ్ళి భారత్ హీకీ టీమ్ను ఓడించింది. ఇక దీంతో కాంస్య పతకం కోసం మన్ప్రీత్ టీమ్ ఎలాగైన తర్వాత జరిగే ఆటలో పతకం సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. గతంలో 1980లో చివరిసారి భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. భారత హాకీ ప్లేయర్స్ ఎలాగైన ప్రత్యర్ధులను ఓడించి స్వర్ణ పతకంతో చరిత్ర తిరగరాస్తారని క్రీడా అభిమానులు ఆశించారు.