దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గత రెండు మ్యాచ్ల్లో బ్యాటర్లు రాణించడంతో దుమ్మురేపిన రోహిత్ సేన.. ఈ సారి టాపార్డర్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. పేస్కు స్వర్గధామమైన పెర్త్ పిచ్పై ప్రోటీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో.. మనవాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా నిర్దేశించగలిగింది. అయితే ఓడిపోవడానికి కారణం దారుణమైన బ్యాటింగ్ తో పాటు క్యాచ్ మిస్, రనౌట్లేనని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా వెల్లడించాడు. అయితే ఈ వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కొట్టిపడేశాడు. క్యాచ్ డ్రాపులు, రనౌట్లు మ్యాచులో సహజమే అన్న గవాస్కర్.. ఓ బౌలర్ కారణంగా భారత్ మ్యాచ్ కోల్పోయిందని తెలిపాడు.
రెండు మ్యాచ్ల్లో నెగ్గి టీ20 ప్రపంచకప్లో ఎదురులేకుండా సాగుతున్న భారత్కు.. దక్షిణాఫ్రికా ఓటమి రుచిచూపింది. ఆదివారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ‘మిస్టర్ ఇండియా 360’ సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 68; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లుగానే పెవిలియన్ చేరారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 రన్స్ చేసింది. అయితే బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమ్ఇండియాకు బౌలింగ్లో శుభారంభం దక్కింది. అయితే దాన్ని సద్వినియోగ పరుచుకోలేక పోయారు. క్యాచులు, రనౌట్లు జారవిడుస్తూ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఓటమిపై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు.
Rohit missed a run-out, sadly not happening for India.#ViratKohli & #RohitSharma𓃵 🥺#VideoViral pic.twitter.com/vB9aZXUoqG
— Priyanshu Rout (@priyanshurout54) October 30, 2022
“రనౌట్లు, క్యాచ్ మిస్ లు మ్యాచ్ లో సహజం. వీటి గురుంచి ఆటగాళ్లను నిందించడానికి వీళ్లేదు. అదృష్టం కలిసిరానప్పుడు అగ్రశ్రేణి ఆటగాళ్లు కూడా క్యాచ్ లు డ్రాప్ చేస్తారు. రనౌట్లు మిస్ చేస్తారు. కానీ ఈ మ్యాచులో వీటన్నికంటే ప్రధాన సమస్య. ఒక బౌలర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 43 పరుగులివ్వడమే. దీంతోనే భారత్ ఓడింది..” అని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ మ్యాచులో పేసర్లు భువీ, అర్ష్దీప్, షమీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా అశ్విన్ 4 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకున్నాడు. సౌతాఫ్రికా విజయానికి చివరి 3 ఓవర్లలో 25 పరుగులు అవసరముండగా, అశ్విన్ వేసిన 18వ ఓవర్లో మిల్లర్ రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచును సులభతరం చేశాడు.
Ravichandran Ashwin had a horrible day, conceding a third of the total runs scored by South Africans with an economy of nearly 11 runs.#INDvSA #T20WorldCup #Ashwin #SouthAfrica #TeamIndia pic.twitter.com/kQyTAmlB7P
— SportsCafe (@IndiaSportscafe) October 30, 2022