టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సత్తా చాటుతోంది. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఘనవిజయంతో గ్రూప్ బీ టేబుల్ టాపర్గా సెమీస్లోకి అడుగుపెట్టింది భారత్. టీమిండియాతో పాటు గ్రూప్ బీ నుంచి అనూహ్యంగా పాకిస్థాన్ కూడా సెమీస్కు చేరింది. ఈ నెల 9న న్యూజిలాండ్-పాకిస్థాన్ తొలి సెమీస్ ఆడనున్నాయి. అలాగే 10న ఇంగ్లండ్తో టీమిండియా ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనుంది. కాగా.. ఈ సెమీ ఫైనల్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ బౌలింగ్ దళానికి అగ్ని పరీక్ష పెట్టాడు. టోర్నీ ఆరంభానికి ముందు చాలా బలహీనంగా కనిపించిన టీమిండియా బౌలింగ్ ఎటాక్పై ఎన్నో విమర్శలు వచ్చాయి. బుమ్రా లేని బౌలింగ్ ఎటాక్తో టీమిండియా వరల్డ్ కప్లో రాణించడం అసాధ్యమనే అభిప్రాయాలు వినిపించాయి.
కానీ.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటుతున్నారు. వీరికి తోడు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తూ.. తమ బౌలింగ్ ఎటాక్పై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు. పాకిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్లో సత్తా చాటిన భారత బౌలర్లు.. ఆ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్లోనూ అదరగొడుతున్నారు. ఇదే ప్రదర్శన మరో రెండు మ్యాచ్ల్లో కొనసాగితే.. టీమిండియా రెండో సారి పొట్టి ప్రపంచ కప్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కొండంత అండగా నిలుస్తుండగా.. ఇటివల కేఎల్ రాహుల్ సైతం ఫామ్లోకి వచ్చాడు. ఇక రోహిత్ కూడా ఫామ్లోవి వస్తే.. ప్రత్యర్థి బౌలర్లకు బ్యాండ్ బాజా బారాతే.
అయితే.. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత బౌలర్లకు ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. పిచ్ తొలుత బౌలింగ్కు అనుకూలంగా ఉందనే సమాచారం ఉన్నా.. తాము సెట్ చేసే టార్గెట్ను తమ బౌలర్లు కాపాడుకుంటారో లేదో చూడాలని.. తొలుత బ్యాటింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన రోహిత్.. టీమిండియా బౌలర్లకు ఛాలెంజ్ విసిరాడు. అప్పటికే నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో.. టీమిండియా ఆ మ్యాచ్కు ముందు సెమీస్ క్వాలిఫై అయిపోయింది. దీంతో సరదాగా తమ బౌలర్లకు పరీక్ష పెట్టాడు రోహిత్. కెప్టెన్ విసిరిన ఛాలెంజ్ను చాలా సీరియస్గా తీసుకున్న బౌలర్లు.. తమ సత్తా ఏంటో చూపించాడు. జింబాబ్వేను 115 పరుగులకే ఆలౌట్ చేసి.. కెప్టెన్ పెట్టిన పరీక్షలో వందశాతం మార్కులతో పాస్ అయ్యారు. పైగా బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్ వికెట్ తీసుకోవడం విశేషం. అశ్విన్ 3, షమీ 2, పాండ్యా 2, అర్షదీప్, భువీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.
Rohit Sharma at toss: We want to come out here and do what we have been doing.
Team India 👇
Klol #TeamIndia #INDvSA #INDvSA #LungiNgidi pic.twitter.com/e7tcif8SaF
— Rajeev Rai 🇮🇳 (@Rajeev_Bharat) October 30, 2022