మెల్ బోర్న్ పోరులో విజయం సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లందరూ రిలాక్స్డ్ మూడ్ లో కనిపించారు. ప్రాక్టీస్ ఆప్షనల్ కావడంతో కొంతమంది ఆటగాళ్లు సిటీ-వాక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా టీమిండియా సారధి రోహిత్ రోహిత్ శర్మ, మిస్టర్ ఇండియా 360 సూర్య కుమార్ యాదవ్ బాగానే తిరిగినట్లు కనిపిస్తున్నారు.
పొట్టి ప్రపంచ కప్ సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన శుభారంభమే చేసింది. దాయాధి పాకిస్తాన్ పై 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో ఆటగాళ్లపై కాస్త ఒత్తిడి తగ్గిందనే చెప్పాలి. ఆటగాళ్లు కూడా చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారు. భారత జట్టు తదుపరి మ్యాచులో నెదర్లాండ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా జరగనుంది. కాగా, ఈ మ్యాచుకు మూడు రోజుల గ్యాప్ రావడంతో ఆటగాళ్లకు బాగానే రెస్ట్ లభించింది. అందులోనూ ఇవాళ ప్రాక్టీస్ సెషన్ ఆప్షనల్. అంటే.. ఇంటరెస్ట్ ఉన్న ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయొచ్చు.. లేని వాళ్లు, హోటల్ కే పరిమితమవ్వొచ్చు లేదంటే పర్మిషన్ తీసుకొని బయట తిరోగచ్చు. ఈ తరుణంలో టీమిండియా సారధి రోహిత్ రోహిత్ శర్మ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి బయట తిరుగుతూ ఎంజాయ్ చేశారు.
Rohit Sharma with his family in Sydney. pic.twitter.com/fUJnw7XJ1N
— Johns. (@CricCrazyJohns) October 25, 2022
రోహిత్, భార్యా కుమార్తెతో కలిసి సిడ్నీ హార్బర్ సమీపంలో పర్యటించగా, సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి సిడ్నీ వీధుల్లో తిరిగాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు..’బాగానే ఎంజాయ్ చేస్తున్నారు..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, పాకిస్తాన్ పై విజయంతో భారత జట్టు దాదాపు సెమీస్ చేరినట్లే. తదుపరి మ్యాచుల్లో నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వేతో తలపడాల్సి ఉంది. మూడు మ్యాచుల్లో విజయం సాధిస్తే సెమీస్ చేరడం పక్కా.
Hello Sydney 👋
We are here for our 2⃣nd game of the #T20WorldCup! 👏 👏#TeamIndia pic.twitter.com/96toEZzvqe
— BCCI (@BCCI) October 25, 2022