టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ చేసిన ఫేక్ ఫీల్డింగ్ను ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని.. వాళ్లు గుర్తించి ఉంటే తమకు ఐదు పెనాల్టీ రన్స్ వచ్చేవని.. ఆ రన్స్తో తాము మ్యాచ్ గెలిచే వాళ్లమని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదం ఇప్పుడు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి లేదా సదరు వరల్డ్ కప్ కమిటీకి ఫీల్డ్ అంపైర్లపై ఫిర్యాదుకు సిద్ధమైనట్లు సమాచారం. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వ్యవహారంతో పాటు అతను నో బాల్ కోరగానే నో బాల్ ఇవ్వడం.. చివరి ఓవర్స్లో వైడ్ బాల్ అయినా.. దాన్ని వైడ్గా ప్రకటించకపోవడంపై తాము ఫిర్యాదు చేస్తామని బంగ్లా బోర్డు పెద్దలు పేర్కొంటున్నారు.
బంగ్లాదేశ్-టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ త్వరగానే కోల్పోయినా.. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో పాటు సూర్యకుమార్ వేగం 30 పరుగులు చేయడంతో టీమిండియా కోలుకుంది. ఇక రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తూ.. 62 పరుగులతో చివరి నిలబడి టీమిండియాకు మంచి స్కోర్ అందించాడు. అయితే.. బంగ్లా పేసర్ వేసిన బౌన్సర్ను కోహ్లీ ఫుల్ షాట్ ఆడి.. అది తన కంటే హైట్గా వెళ్లిందని.. నో బాల్ కాదా? అని అంపైర్ను ప్రశ్నించాడు. వెంటనే అంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించాడు. ఈ విషయంపై బంగ్లా కెప్టెన్ వెంటనే అంపైర్తో వాదనకు దిగాడు. కానీ.. కోహ్లీ సర్దిచెప్పడంతో షకీబ్ వెనక్కి వెళ్లిపోయాడు.
అలాగే.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడు మీదున్న లిట్టన్ దాస్.. డీప్ ఆఫ్సైడ్ వైపు షాట్ ఆడి సింగిల్ తీసుకుంటాడు. అయితే.. ఫీల్డర్ అర్షదీప్ బంతి అందుకుని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్కు త్రో వేస్తాడు. ఆ బంతి.. పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ పక్కగా వెళ్లింది. బంతి దగ్గరకు రాగానే కోహ్లీ ఆ బంతి అందుకుని నాన్ స్ట్రైకర్ వైపు త్రో విసురుతున్నట్లు యాక్షన్ చేశాడు. ఇదే ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. అది ఫేక్ ఫీల్డింగ్ అని.. అంపైర్లు ఆ విషయం పట్టించుకోలేదని, తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బంగ్లా క్రికెటర్ నూరుల్ వాపోతున్నాడు. దీనికి బంగ్లా, పాక్ ఫ్యాన్స్ సైతం వత్తాసు పలుకుతూ.. చీటింగ్ అంటూ పేర్కొంటున్నారు. అయితే.. కోహ్లీ సరదాగా చేసిన పనికి ఇంత రచ్చ అవసరం లేదంటూ ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే.. కోహ్లీపై కాకుండా.. ఆ ఫేక్ ఫీల్డింగ్ను గుర్తించడంలో విఫలమైన ఫీల్డ్ అంపైర్లపై బంగ్లా క్రికెట్ బోర్దు ఫిర్యాదుకు సిద్ధమైనట్లు సమాచారం.
Kohli was spotted distracting Shanto by “fake fielding.” As per the law, India was supposed to be given 5 runs penalty for such a shameful. But guess what? The on-field umpires didn’t even care to recheck and instantly denied taking any action. #cheating #T20WorldCup #INDvBAN pic.twitter.com/A5MPAIilE8
— Nazmus Sajid Chowdhury (@nazmussajid) November 2, 2022