ఐపీఎల్- 2023 సందడి అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ప్లేయర్లు, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను కూడా విడుదల చేశాయి. అయితే ఈసారి మినీ వేలంలో ఎస్ఆర్హెచ్ జట్టు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉండబోతోందనే చెప్పాలి. ఎందుకంటే.. అందరికంటే ఎక్కువ పర్స్ వ్యాల్యూ ఇప్పుడు హైదరాబాద్ ఫ్రాంచైజీ దగ్గరే ఉంది. రూ.42.25 కోట్లతో అన్ని ఫ్రాంచైజీల కంటే టాప్ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. అంతేకాకుండా ఈసారి హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం అందరినీ కాస్త విస్మయానికి గురిచేసింది. అదేంటంటే.. 12 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసిన ఎస్ఆర్హెచ్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అయితే ఇప్పుడు ఇంత మందిని వదులుకోవడానికి కూడా గట్టి కారణమే ఉందని చెబుతున్నారు.
కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, సీన్ అబాట్, రొమారియో షెపర్డ్, ప్రియమ్ గార్గ్ వంటి ఆటగాళ్లను వదులుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే గత సీజన్లో జరిగిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎక్కువ పొందుతున్న వాళ్లు, జట్టులో అంత ప్రభావం చూపలేని ఆటగాళ్లను పంపేసి.. కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మినీ వేలంలో పర్స్ పరంగానూ ఎస్ఆర్హెచ్కు పూర్తి స్వేచ్ఛ ఉంది. తమకు ఎవరు కావాలనుకుంటే వారిని ఎక్కువ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కూడా కావ్య పాప చక్రం తిప్పేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.
It was one memorable association, #Risers. 🧡
Thank you for your contributions and here’s wishing you all the very best for your future endeavours. 🙌#SunRisersHyderabad pic.twitter.com/3s4ICRV4mA
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022
జింబాబ్వే జట్టు గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా చర్చ జరుగుతోంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో వాళ్లు ఒక సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే. ఆ జట్టులో ముఖ్యంగా సికందర్ రజా పేరు బాగా వినిపించింది. ఇప్పుడు కావ్య మారన్ దృష్టి కూడా అతనిపై పడినట్లు తెలుస్తోంది. పైగా అతడిని తీసుకునేందుకు పెద్దగా పోటీ కూడా ఉండదు. సికిందర్ రజా కూడా ఎప్పటినుంచో ఐపీఎల్లోకి వచ్చేందుకు ఉవిళ్లూరుతున్నాడు. ఈ క్రమంలోనే కావ్య కచ్చితంగా సికిందర్ రజాతో మాట్లాడి.. అతడిని వేలంలో దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుందని టాక్ వస్తోంది. ఇంక జింబాబ్వేకి ఉన్న అత్యుత్తమ ఆల్రౌండర్లలో సికిందర్ రజా ఒకడు. అంతర్జాతీయ టీ20ల్లో 61 మ్యాచుల్లో 1,176 పరుగులు స్కోర్ చేశాడు. అలాగే 33 వికెట్లు కూడా పడగొట్టాడు. వచ్చే ఐపీఎల్కు ఎస్ఆర్హెచ్కు సికందర్ రజా మంచి ఛాయిస్ అవుతాడని చెప్పొచ్చు.
#OrangeArmy, here are the #Risers who will continue to be a part of our journey for #IPL2023 🧡 #SunRisersHyderabad pic.twitter.com/B3ExEz8bP3
— SunRisers Hyderabad (@SunRisers) November 15, 2022