టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో తాను ఆడిఉంటే భారత్ మూడు వరల్డ్ కప్లు గెలిచేదని టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. భారత్ను సమర్థవంతంగా నడిపించాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2021 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా కోహ్లీ కెప్టెన్సీల్లోనే ఆడింది.
కానీ.. ఈ మెగా ఈవెంట్లలో విజేతగా నిలవలేకపోయింది. వీటితో పాటు 2021 ఏడాది చివరిలో జరిగిన టీ20 ప్రపంచ కప్లో దారుణంగా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్గా తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం, టెస్టు కెప్టెన్సీ నుంచి తానే స్వయంగా తప్పుకోవడం తెలిసిందే. పైగా కోహ్లీ ప్రస్తుతం ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో నేను ఆడి ఉంటే టీమిండియా 2015, 2019, 2021 వరల్డ్ కప్లు గెలిచి ఉండేదని అన్నాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా గెలిచిన 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ జట్లలో శ్రీశాంత్ ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ శ్రీశాంత్పై ఏడేళ్ల నిషేధం విధించింది.
నిషేధం ముగిసిన తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన శ్రీశాంత్.. 2022 ఐపీఎల్ మెగా వేలంలో కూడా పాల్గొన్నాడు. కానీ అతన్ని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అయితే శ్రీశాంత్ గత ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ లాంటి అగ్రెసివ్ కెప్టెన్ అండర్లో ఆడి ఉంటే మంచి ప్రదర్శన ఇచ్చే వాడిననే ఉద్దేశంతో శ్రీశాంత్ ఈ విధంగా మాట్లాడినట్లు అర్థం అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
S Sreesanth was part of India’s T20 WC 2007 and WC 2011 winning teams🏆🏆 pic.twitter.com/TTDTNFjsKw
— CricTracker (@Cricketracker) July 19, 2022