ప్రస్తుతం టీమిండియా మంచి జోరుమీదుంది. వరుసగా సిరీస్ ల మీద సిరీస్ లు కైవసం చేసుకుంటూ.. దూసుకెళ్తొంది. వచ్చే వరల్డ్ కప్ కొట్టడమే ధ్యేయంగా టీమిండియా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లపై సిరీస్ లను నెగ్గి.. వరల్డ్ కప్ హాట్ ఫేవరెట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే టీమిండియాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. వన్డే వరల్డ్ కప్ గెలిచే సత్తా భారత్ కు ఉందని తేల్చి చెప్పాడు. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలవాలి అంటే మాత్రం కచ్చితనంగా తన గేమ్ ను మార్చుకోవాలని సూచించాడు బెంగాల్ దాదా గంగూలీ.
టీమిండియా ప్రస్తుత ఫామ్ ను చూస్తే.. వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని భారత మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇటీవలి కాలంలో టీమిండియా అద్భుతంగా ఆడుతుందని, పైగా జట్టు కూడా ఎంతో పటిష్టంగా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలవాలి అంటే.. భయం లేకుండా ఫియర్ లెస్ గేమ్ ఆడాలని సూచించాడు దాదా. ప్రస్తుతం టీమిండియా చేస్తున్న పని ఇదే అయినప్పటికీ మరింతగా ధైర్యంగా ఆడాలని సౌరవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే ఎటాకింగ్ గేమ్ ఆడినప్పుడే ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టెస్తామని, ఇది జట్టు విజయానికి తోడ్పడుతుందని సౌరవ్ పేర్కొన్నాడు. కప్పు గెలుస్తామో అన్న విషయం పక్కన పెడితె.. ప్రపంచ కప్ లో ధైర్యంగా ఆడాలని గంగూలీ సూచించాడు. ఇక ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ ను చూస్తే.. ప్రపంచ కప్ గెలవడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. మరి టీమిండియాకు సౌరవ్ గంగూలీ ఇచ్చిన సూచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ganguly (in Sports Tak) said “India should play fearless cricket and without any baggage when they reach the World Cup”.
— Johns. (@CricCrazyJohns) January 29, 2023