బాబర్ అజమ్ టీమ్ కోసం కాకుండా.. తన కోసం మాత్రమే ఆడుతున్నాడని, జట్టు ఓడిపోతుంటే తొక్కలో సెంచరీలు ఎవరికి కావాలంటూ న్యూజిలాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్.. జట్టు కోసం కాకుండా తన స్వార్థం కోసం, వ్యకిగత రికార్డుల కోసం ఆడుతుంటాడనే ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ సైతం ఇప్పుడు అదే వ్యాఖ్య చేశాడు. బాబర్ అజమ్ తన కోసం కాకుండా జట్టు కోసం ఆడాలని, జట్టు ఓడిపోతుంటే తొక్కలో సెంచరీలు ఎందకని ఘాటు వ్యాఖ్యలే చేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ సీజన్లో భాగంగా బుధవారం పెషావర్ జల్మీ-క్వాట్టా గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బాబర్ అజమ్ పెషావర్ జల్మీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం క్వాట్టాతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బాబర్ అజమ్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. యువ క్రికెటర్ సైమ్ అయ్యూబ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన బాబర్.. క్వాట్టా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 65 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సులతో 115 పరుగులు చేశాడు. పీఎస్ఎల్తో తన తొలి సెంచరీని నమోదు చేశాడు.
అతనితో పాటు ఓపెనర్ అయ్యూబ్ సైతం 34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 రన్స్తో రాణించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 162 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన పవర్ హిట్టర్ రోవ్మన్ పావెల్ సైతం 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పెషావర్ 20 ఓవర్లలోనే 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంత భారీ స్కోర్ చేసిన తర్వాత కూడా పెషావర్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉన్న పిచ్పై ప్రత్యర్థి జట్టు క్వాట్టా గ్లాడియేటర్స్ సైతం చేలరేగి ఆడారు. ముఖ్యంగా క్వాట్టా ఓపెనర్ జాసన్ రాయ్ 63 బంతుల్లోనే 20 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగి 145 పరుగులు చేసి.. ఒంటిచేత్తో క్వాట్టా గ్లాడియేటర్స్ను గెలిపించాడు. అయితే.. పెషావర్ ఓటమికి బాబర్ అజమ్ ఆడిన తీరే కారణంగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సైతం బాబర్ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 44 బంతుల్లో 80 పరుగులు చేసి బాబర్.. సెంచరీ కోసం మిగిలిన 20 పరుగులు చేసేందుకు 16 బంతులు తీసుకున్నాడు. 60 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
అయితే.. అప్పటికీ పెషావర్ చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాబర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు నెమ్మదిగా ఆడకుండా వేగంగా ఆడి ఉంటే.. ఇంకో 20, 30 పరుగులు అదనంగా వచ్చి ఉండేవని డౌల్ అభిప్రాయపడ్డాడు. కానీ.. బాబర్ తన సెంచరీ కోసం చివర్లో కాస్త నిదానంగా టైమ్ తీసుకుని ఆడటంతో పెషావర్ స్కోర్ 240కే పరిమతం అయిందని, అది చూసేందుకు పెద్ద స్కోర్లా కనిపిస్తున్నా.. రావాల్పిండి పిచ్పై అది పెద్ద స్కోర్ కాదు. ఆ విషయాన్ని క్వాట్టా గ్లాడియేటర్స్ రుజువు కూడా చేశారు. అందుకే ఇప్పటి నుంచైనా బాబర్ తన కోసం కాకుండా జట్టు కోసం ఆడాలని, మ్యాచ్లు ఓడిపోతుంటే సెంచరీ చేసి ఏం ఉపయోగం అని క్రికెట్ ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Simon Doull was not happy with Babar Azam taking time to score the century with nine wickets in hand.
He scored 20 runs off 16 balls before reaching his maiden PSL century [from 80*(44) to 100*(60)].#PSL8 #BabarAzam #PeshawarZalmi pic.twitter.com/eLiWh73vNW
— CricTracker (@Cricketracker) March 8, 2023