సంజూ శాంసన్.. గత కొంతకాలంగా భారత క్రికెట్ లో ఇతని గురించే చర్చ. ఎంతో టాలెంట్ ఉన్నా కూడా అతడిని కావాలనే పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్ లో సంజూకి అవకాశం కల్పించారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవడంలో సంజూ విఫలమయ్యాడనే చెప్పాలి. తొలి టీ20లో సంజూ శాంసన్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇప్పుడు అసలు మొత్తానికే జట్టు నుంచి తప్పుకున్నాడు.
అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అన్న చందంగా సంజూ శాంసన్ పరిస్థితి మారింది. రాకరాక అవకాశం వస్తే.. శ్రీలంకతో తొలి టీ20లో సంజూ విఫలమయ్యాడు. మిగిలిన రెండు టీ20ల్లో అయినా సత్తా చాటుదామనుకుంటే ఇప్పుడు మొత్తానికే జట్టు నుంచి వైదొలిగాడు. అయితే అతను మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టీ20ల నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తొలి టీ20లో సంజూ శాంసన్ కి గాయం అయ్యింది. ఈ గాయం కారణంగానే సంజూ శాంసన్ జట్టు నుంచి తప్పుకున్నాడు.
BCCI decided to give chances to their uncapped player’s, Time for jitesh Sharma —#BCCI #ICC #CricketTwitter #Cricket #INDvSL #SanjuSamson pic.twitter.com/09dxcq2bMx
— Sports Vibez (@vibez_sports) January 5, 2023
బౌండరీ మీద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ మోకాలికి గాయం అయ్యింది. ఆ తర్వాత అతని మోకాలు నొప్పి బాగా ఎక్కువ కావడంతో వైద్యులను సంప్రదించారు. సంజూ శాంసన్ మోకాలికి స్కాన్ నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. వైద్యుల సలహా మేరకు సంజూ శాంసన్ కి టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో వికెట్ కీపర్ జితేశ్ శర్మని తీసుకున్నారు.
It’s very tough to be fan of Sanju Samson 🙁#INDvsSL #SanjuSamson pic.twitter.com/ZKUsW7FKue
— Dinesh LiLawat (@ImDL45) January 5, 2023
సంజూ స్థానంలో జితేశ్ శర్మ జట్టులోకి వచ్చినట్లు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. గతేడాది ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన జితేశ్ శర్మ 234 పరుగులు చేశాడు. అయితే సంజూ శాంసన్ గాయంతో తప్పుకోవడంతో రాహుల్ త్రిపాఠికి అవకాశాలు మెరుగయ్యాయనే చెప్పాలి. ఎప్పటి నుంచో జట్టులో స్థానం కోసం రాహుల్ త్రిపాఠి ఎదురుచూస్తూనే ఉన్నాడు. మరి రెండో టీ20లో త్రిపాఠికి అవకాశం కల్పిస్తారేమో చూడాలి. అవకాశం వస్తే.. రాహుల్ దానిని సద్వినియోగం చేసుకుంటాడా? లేక చేజార్చుకుంటాడా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. గురువారం రాత్రి 7 గంటలకు శ్రీలంక- భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
Get well soon, Sanju Samson
can’t wait to see you back on the field#cricket #teamindia #ssanjusamson pic.twitter.com/x07LGjF8Up— Cricket Addictor (@AddictorCricket) January 5, 2023