టీమిండియా యువ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(114)తో చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో హోరెత్తించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022లో భాగంగా కేరళతో జరిగిన మ్యాచ్ లో ఈ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతోన్న.. మరో ఎండ్లో నిలకడగా ఆడుతూనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. అతని అద్భుతమైన సెంచరీ ఫలితంగా మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ మహారాష్ట్రకు మంచి ఆరంభమే లభించింది. తొలి వికెట్ కు పవన్ షా(34)తో కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.. రుతురాజ్. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 2 బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరగగా, అజిమ్ కాజి 17 బంతుల్లో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇలా వరుస క్రమంలో వికెట్లు పడుతున్నా.. రుతురాజ్ నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. మొత్తం 68 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కేరళ బౌలర్లలో సిజోమాన్ 3 వికెట్లు తీయగా, కెఎం ఆసిఫ్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.
Yet another game yet another Century for Ruturaj Gaikwad in Syed Mushtaq Ali Trophy 💛🥳
114 Runs | 68 Balls | 8 Fours | 7 Sixes#KERvMAH #WhistlePodu #SyedMushtaqAliT20 @Ruutu1331 pic.twitter.com/FNXEPde4dG
— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) October 18, 2022