బంగ్లాతో తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుంది అనుకున్న టీమిండియా చివర్లో తడబడింది. 5 పరుగుల తేడాతో బంగ్లా సింహాల చేతిలో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు. చేతి వేలికి గాయం అయినప్పటికీ అద్వితీయమైన పోరాటంతో ఆకట్టుకున్నాడు. ఓ వైపు గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ చివర్లో బ్యాటింగ్ కు దిగి కేవలం 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం తన వేలికి తలిగిన గాయంపై స్పందించాడు రోహిత్.
బంగ్లాతో రెండో వన్డే టీమిండియాకు చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం. క్రీజ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంకేం భారత విజయం ఖాయం అనుకున్నారు. కానీ అప్పటికే గాయం కారణంగా తీవ్ర నొప్పిని ఎదుర్కొంటూనే తన బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నాడు రోహిత్. ముస్తఫిజుర్ వేసిన చివరి ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు రోహిత్. ఇక చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సిన నేపథ్యంలో రోహిత్ ఒక్క పరుగు కూడా సాధించలేదు. దాంతో టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రక్తం కారుతున్న గాయంతోనే ఫీల్డింగ్ చేయకుండా రోహిత్ మైదానం విడిచిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తను తగిలిన గాయంపై స్పందించాడు హిట్ మ్యాన్.
“నా వేలికి ఫ్రాక్చర్ అయితే కాలేదు. కానీ ఎముక కొద్దిగా పక్కకు జరిగినట్లు ఫిజియో తెలిపాడు. నోప్పి భరిస్తూనే జట్టు విజయం కోసం బరిలోకి దిగాను. కానీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేక పోయాను. ఇక 69 రన్స్ కేే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాను 270 పరుగుల దాకా తీసుకురావడం కచ్చితంగా బౌలర్ల వైఫల్యమే” అని రోహిత్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఇక ఈ గాయం కారణంగా రోహిత్ మూడో వన్డేకు అందుబాటులో ఉండడు అని కోచ్ ద్రవిడ్ తెలిపాడు. ఇప్పటికే రోహిత్ విశ్రాంతి కోసం ఇండియాకు చేరుకున్నాడు. రోహిత్ శర్మ వీరోచిన ఇన్నింగ్స్ పై కోచ్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురింపించాడు. ఇదొక అద్భుతమైన.. అఖండమైన ఇన్నింగ్స్ గా కొనియాడాడు.
Captain Rohit Sharma came to bat with an injured thumb.
R E S P E C T 💗
📸: Sony Sports pic.twitter.com/sHHOu54Sn8
— CricTracker (@Cricketracker) December 7, 2022