భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ వన్డే మ్యాచ్ భారత్కు 1000వ వన్డే. ఈ ప్రతిష్టాత్మకమైన మైలురాయిని విజయంతో దాటింది. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. జట్టు సభ్యుడు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను తిట్టాడు. రోహిత్ కోపానికి కారణం.. ప్రసిద్ధ్ ఒక క్యాచ్ను జారవిరిచాడు. దీంతో రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. వెస్టిండీస్ వికెట్లు వరుసగా పడుతున్నా.. జేసన్ హోల్డర్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు.
కానీ అతను 23 పరుగుల వద్ద ఉన్న సమయంలో చాహల్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ వైపు భారీ షాట్ ఆడాడు. దాన్ని ప్రసిద్ధ్ కృష్ణ అందుకోలేకపోయాడు. అతని చేతుల్లోంచి బంతి బౌండరీ అవతల పడింది. దీంతో అది సిక్సుగా వెళ్లింది. ఈజీగా అందుకోవాల్సిన క్యాచ్ను ప్రసిద్ధ్ జారవిరవడంతో రోహిత్ కోపడ్డాడు. ప్రసిద్ధ్ కృష్ణపై రోహిత్శర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఆ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన హోల్డర్.. 7 బంతుల్లో 57 పరుగుల చేశాడు. మరి ప్రసిద్ధ్పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.