భారత్-ఆసిస్ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో వరుసగా విఫలం అవుతున్న కేఎల్ రాహుల్ ను ఆడించాలని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్ తో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-1తో ముందంజలో ఉంది టీమిండియా. అయితే తొలి రెండు టెస్టుల్లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు.. మూడో టెస్ట్ లో చేతులెత్తేశారు. దాంతో ప్రపంచ టెస్ట్ ఛాపింయన్ షిప్ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ను క్లిష్టతరం చేసుకున్నారు. దాంతో చివరిదైన నాలుగో టెస్ట్ లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై తర్జనభర్జనలు పడుతోంది టీమిండియా. ఈ క్రమంలో భారత జట్టులోకి కేఎల్ రాహులను తీసుకోవాలని సూచించాడు ఆసిస్ దిగ్గజం పాంటింగ్.
భారత్-ఆసిస్ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తేనే టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. దాంతో భారత్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. అయితే మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలం అవ్వడంతో.. నాలుగో టెస్ట్ జట్టు కూర్పుపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక వరుసగా వైఫల్యం అవుతున్న కేఎల్ రాహుల్ ను మూడో మ్యాచ్ కు జట్టు నుంచి తప్పించిన విషయం మనకు తెలిసిందే. అతడి స్థానంలో ఈ మ్యాచ్ లో యంగ్ ప్లేయర్ గిల్ కు అవకాశం కల్పించారు. కానీ గిల్ సైతం ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలం అయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులోకి కేఎల్ రాహుల్, గిల్ ను తీసుకోవాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసిస్ దిగ్గజం రికీ పాంటింగ్.
ఓ క్రీడా ఛానల్ తో ఈ విషయంపై పాంటింగ్ మాట్లాడుతూ..”కేఎల్ రాహుల్ విఫలం అవుతున్నాడని, అతడిని తప్పించి గిల్ కు అవకాశం ఇచ్చారు. కానీ గిల్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే వీరిద్దరు గొప్ప ఆటగాళ్లే.. అందులో సందేహం లేదు. ఇక నాలుగో టెస్ట్ లో వీరిద్దరిని ఆడించాలి. గిల్ ను ఓపెనింగ్ కు పంపి, రాహుల్ ను మిడిలార్డర్ లో ఆడించొచ్చు. గతంలో రాహుల్ ఇదే స్థానంలో టెస్ట్ క్రికెట్ ఆడాడు” అంటూ ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇక WTC ఫైనల్ మ్యాచ్ జరిగే పిచ్ పై కూడా ఈ సందర్భంగా కామెంట్స్ చేశాడు పాంటింగ్. యూకేలో ని పిచ్ పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉంటాయని, బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతూనే ఉంటుందని పాంటింగ్ అన్నాడు.
ఇక గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే? సమర్థవంతంగా స్పిన్ ను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్లు దిట్ట.. అయితే ఈ సిరీస్ లో మాత్రం టీమిండియా బ్యాటర్లు ఆసిస్ స్పిన్ బౌలర్లను ముఖ్యంగా నాథన్ లయోన్ ఎదుర్కొవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బలహీనతను అధిగమిస్తేనే భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లి.. దాన్ని కైవసం చేసుకోగలదని క్రికెట్ పండితులు ఆభిప్రాయపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో కేఎల్ రాహుల్, గిల్ లను ఆడించాలి అన్న పాంటింగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.