డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి రోజు భారత్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. చక చక మూడు వికెట్లు తీసి పట్టు బిగించినట్లుగా కనబడినా.. స్మిత్, హెడ్ జోడీ విడదీయలేక నానా తంటాలు పడ్డారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. ఓకవేళ అశ్విన్ గనుక తుది జట్టులో ఉంటే ఫలితం వేరేలా ఉండే అవకాశం లేకపోలేదు.
అతడు ప్రపంచములోనే నెంబర్ వన్ స్పిన్నర్.. కానీ ఏం లాభం తుది జట్టులో చోటు మాత్రం దక్కలేదు. లెఫ్ట్ హ్యాండర్స్ అతని బౌలింగ్ లో హడలెత్తిపోతారు…అయినా పక్కన పెట్టేసారు. డబ్ల్యూటీసీ ఫైనల్ రావడంలో కీలక పాత్ర పోషించాడు. చివరికి పెవిలియన్ లో కూర్చోబెట్టారు. ఇదంతా టీమిండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ గురించి చెబుతున్న మాటలు. నిన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అశ్విన్ కి తుది జట్టులో స్థానం దక్కకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరిగ్గా ఆలోచిస్తే రోహిత్ అంచనా తప్పినట్లుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మ్యాచులో భారత్ వికెట్లు తీయలేక వెనకపడిన సంగతి తెలిసందే. ఓకవేళ అశ్విన్ గనుక తుది జట్టులో ఉంటే ఫలితం వేరేలా ఉండే అవకాశం లేకపోలేదు.
అశ్విన్ టెస్టుల్లో ఎంత ప్రమాదకరమైన బౌలరో అందరికి తెలిసిందే. బ్యాటర్ల మైండ్ సెట్ ముందుగానే అంచనా వేసి వికెట్ రాబట్టడంలో అశ్విన్ దిట్ట. అందుకే అశ్విన్ బౌలింగ్ అంటే ఎంత టాప్ బ్యాటర్ అయినా కాస్త ఆచితూచి ఆడతాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. అయితే అశ్విన్ కి తుది జట్టులో చోటు లభించకపోవడం షాక్ కి గురి చేసింది. దీంతో అశ్విన్ లేని భారత్ బౌలింగ్ దళం ఈ మ్యాచులో పూర్తిగా చేత్తులెత్తేసింది. చక చక మూడు వికెట్లు తీసి పట్టు బిగించినట్లుగా కనబడినా.. స్మిత్, హెడ్ జోడీ విడదీయలేక నానా తంటాలు పడ్డారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది.
నలుగురు పేసర్లతో వెళ్లాలా? లేదా ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లాలా? ఎప్పటినుంచో ఈ ప్రశ్న టీమిండియాకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. కానీ మ్యాచ్ కి ముందు ఓవర్ కాస్ట్ కండీషన్స్ ఉండడంతో రోహిత్ నలుగురు పేసర్లను ఆడించాల్సిన పరిస్థితి వచ్చింది. రోహిత్ వేసిన ఈ అంచనా తప్పినట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ అశ్విన్ ని ఈ మ్యాచులో ఆడించి ఉంటే పరిస్థితి ఖచ్చితంగా వేరుగా ఉండేది. పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించినా.. ఆసీస్ మీద అశ్విన్ రికార్డ్ చాలా మెరుగ్గా ఉంది. అంతేకాదు లెఫ్ట్ హ్యాండర్స్ ని బోల్తా కొట్టించడంలో అశ్విన్ కి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఆసీస్ జట్టులో ఖవాజా, వార్నర్, హెడ్, క్యారీ లాంటి బ్యాటర్లు మీద అశ్విన్ ఇదివరకే ఆధిపత్యం చూపించాడు. అలాంటి రికార్డుని దృష్టిలో పెట్టుకొని అశ్విన్ కి తుది జట్టులో స్థానం కల్పించకుండా రోహిత్ శర్మ పెద్ద తప్పే చేసినట్లుగా కనిపిస్తున్నాడు.
ఇక ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(146), సెంచరీతో కదం తొక్కగా.. స్టీవ్ స్మిత్(95) సెంచరీకి చేరువలో ఉన్నాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యం కారణంగానే తొలిరోజు ఆసీస్ మ్యాచ్ పై ఆధిపత్యం ప్రదర్శించింది. భారత పేసర్లు సిరాజ్, శార్దూలు, షమీ కి తలో వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచులో భారత్ తిరిగి పుంజుకోవాలంటే రెండో రోజు తొలి సెషన్ చాలా కీలకం కానుంది. ఈ సెషన్ లో ఎంత త్వరగా వికెట్లు తీయగలిగితే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వొచ్చు. మరి అశ్విన్ కి తుది జట్టులో స్థానం కల్పించకపోవడం ఎంతవరకు ప్రభావం చూపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.