భారతదేశంలో డిసెంబర్ 30న (శుక్రవారం) రెండు విషాదకరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకటి ప్రధాన మంత్రి తల్లి హీరాబెన్ మరణం అయితే.. ఇంకోటి టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు కారు ప్రమాదం జరగడం. ఇక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ గత కొన్ని రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. తాజాగా ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆమె అంత్యక్రియలను పూర్తిచేశారు ప్రధాని మోదీ. ఈ క్రమంలోనే తల్లి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ రిషబ్ పంత్ కు జరిగిన ప్రమాదంపై స్పందించారు మోదీ.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ శుక్రవారం ఉదయం అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు. దాంతో తీవ్ర శోకంలో మునిగిపోయారు మోదీ. ఇక తన తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ప్రభుత్వ కార్యకాలాపాల్లో పాల్గొన్నారు. దాంతో మోదీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. తల్లి మరణించిన బాధను సైతం దిగమింగుకుని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మోదీ. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారు జామున టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై తాజాగా స్పందించారు మోదీ. రిషబ్ పంత్ కు జరిగిన ప్రమాదం తెలిసి చాలా బాధపడ్డాను. త్వరగా అతడు కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ట్విటర్ వేదికగా రాసుకొచ్చారు మోదీ. ఓవైపు తల్లి మరణంలోనూ మరో మనిషి బాగోగుల గురించి ఆలోచించే గొప్ప మనసున్న ప్రధాని మోదీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పంత్ ప్రమాదంపై మోదీ చేసిన ట్విట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Distressed by the accident of noted cricketer Rishabh Pant. I pray for his good health and well-being. @RishabhPant17
— Narendra Modi (@narendramodi) December 30, 2022