ఆసియా కప్ లో ఇక పాక్ ఆటలు సాగేలా కనబడడం లేదు. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి వేరే దేశానికి తరలిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటివరకు హైబ్రిడ్ మోడల్ ని భారత్ తిరస్కరించగా..ఇప్పుడు మరో మూడు ఆసియా దేశాలు కూడా పాకిస్థాన్ కి అనుకోని షాకిచ్చాయి.
2023 ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా నెలల పాటు ఆసియా కప్ ఎక్కడ నిర్వహించాలనే విషయంలో ఏసీసీ(ఆసియా క్రికెట్ కౌన్సిల్) ఎటూ తేల్చుకోలేకపోతుంది.షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ పాకిస్థాన్ లో నిర్వహించాలి. కానీ పాకిస్థాన్ లో అడుగుపెట్టే ప్రసక్తే లేదని బీసీసీఐ ఖరాఖండీగా చెప్పేసింది. ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్ అంటూ ఒక కొత్త ఒప్పందం తెచ్చినా.. ఈ ప్రతిపాదనను కూడా బీసీసీఐ నిరాకరించింది. దీని ప్రకారం.. ఆసియా కప్ – 2023 లో భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈలో గానీ శ్రీలంకలో గానీ నిర్వహించాలని పీసీబీ తో పాటు ఏసీసీ సభ్యదేశాలు అంగీకారానికి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ లో యూఏఈలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే కారణంగా వెనక్కి తగ్గింది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ కి మూడు ఆసియా దేశాలు అనుకోని షాక్ ఇచ్చాయి.
ఆసియా కప్ లో ఇక పాక్ ఆటలు సాగేలా కనబడడం లేదు. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి వేరే దేశానికి తరలిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో బీసీసీఐ మాత్రమే హైబ్రిడ్ మోడల్ ని వ్యతిరేకించగా.. తాజాగా ఈ ప్రతిపాదనకు ఆసియా దేశాలైనా శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా నిరాకరించాయని తెలుస్తుంది. దీంతో హైబ్రిడ్ మోడల్ కి ఈ మూడు దేశాలు పాకిస్థాన్ కి షాకివ్వడంతో ఇపుడు పాకిస్థాన్ ఆసియా కప్ ఆడేది అనుమానంగా మారింది. నిన్నటివరకు బీసీసీఐ మద్దతు లేకున్నా ఎలాగోలా లంక, బంగ్లాదేశ్, అఫ్గాన్ ల మద్దతుతో ఆసియా కప్ ను నిర్వహించేందుకు పీసీబీ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ పీసీబీ చూపించిన అతి తెలివి బెడిసికొట్టింది.
ఐపీఎల్ – 16 ఫైనల్స్ లో భాగంగా అహ్మదాబాద్ కు వచ్చిన లంక, బంగ్లా, అఫ్గాన్ క్రికెట్ బోర్డుల అధ్యక్షులతో జై షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే బీసీసీఐ.. ఏసీసీలోని సభ్యదేశాలను తమ వైపునకు తిప్పుకుందని పీసీబీ కూడా ఆరోపించింది. ఆసియా కప్ ను లంకలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కూడా వార్తలు రావడంపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే జరిగితే తాము లంకతో జులైలో జరుగబోయే రెండు టెస్టులు, వన్డే సిరీస్ మ్యాచ్ లపై పునరాలోచిస్తామని హెచ్చరించింది. పీసీబీ ఎన్ని బెదిరింపులకు దిగినా ఏసీసీ సభ్యదేశాలు మాత్రం హైబ్రిడ్ మోడల్ కు తాము అంగీకారం కాదని తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ఇక ఏసీసీ సభ్య దేశాలు ఇదే మాట మీద ఉంటే అది పీసీబీకి భారీ షాక్ ఇచ్చినట్టే. మరి ఈ విషయం ఎప్పటికి ముగుస్తుందో తేలాల్సి ఉంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.