క్రికెట్ ప్రపంచానికి ఒక చేదు వార్త.. న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ క్రిస్ కెయిర్న్స్ క్యాన్సర్ బారిన పడ్డాడు. సాధారణ చెక్అప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన తనకు వైద్యులు ఈ విషాద వార్త చెప్పినట్లు క్రిస్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తెలిపాడు. కాగా గతేడాది ఆగస్టులో కెయిర్న్స్కు గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో శస్త్ర చికిత్స నిర్వహించిన సమయంలో పక్షవాతానికి గురయ్యాడు. వెన్నెముక కూడా బాగా దెబ్బతింది. ఈ క్రమంలో చాలా రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స అందించిన అనంతరం కెయిర్న్స్ కోలుకున్నాడు.
ఇక కివీస్ మాజీ టెస్టు ఆటగాడు లాన్స్ కెయిర్న్స్ కుమారుడైన క్రిస్ కెయిర్న్స్ న్యూజిలాండ్ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు. 1989- 2006 వరకు కివీస్కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. మరి కెయిర్న్స్ క్యాన్సర్ బారిన పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.