మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ధనా ధన్ ధోని.. ఈ పేర్లు వింటేనే అభిమానుల మనసు పులకించిపోతుంది. అలాంటిది ఈ దిగ్గజ క్రికెటర్లు ఇద్దరూ ఒకచోట కలిశారేంటే.. అభిమానులకు ఇంతకన్నా శుభవార్త ఉంటుందా! ఒకేచోట కలవడమే కాదు.. ఇద్దరూ కలిసి టెన్నిస్ కూడా ఆడారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన క్రికెటర్లు ఒకే ఫ్రేమ్లో చూసి అభిమానులు తెగ ఆనందపడుతున్నారు.
సచిన్, ధోనీ.. క్రికెట్ కు వీడ్కోలు పలికాక ఈ ఇద్దరు క్రికెటర్లు ఒకచోట కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. సచిన్.. రోడ్సేఫ్టీ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీల్లో కనిపిస్తున్నా.. ధోనీ ఐపీఎల్ ల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. అయితే.. తాజాగా సచిన్, ధోని ఒకే చోట దర్శనమిచ్చారు. ఓ యాడ్ షూటింగ్లో భాగంగా టెన్నిస్ ఆడుతూ ఒక్క చోట కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రికెట్ తరువాత సచిన్ అమితంగా ఇష్టపడే ఆట.. టెన్నిస్. వీలు దొరికినప్పుడు టెన్నిస్ చూడటానికి కూడావెళ్తుంటాడు. రోజర్ ఫెదరర్ ఆడిన ఎన్నో మ్యాచ్లను ప్రత్యక్షంగా చూశాడు కూడాను. ఇక ధోనికి ఫుట్ బాల్ ఇష్టమనే విషయం అభిమానులకు ఇదివరకే తెలుసు. కాగా, ఇటీవల ముగిసిన రోడ్సేఫ్టీ సిరీస్ లో సచిన్ సారథ్యంలో ఇండియా లెజెండ్స్ జట్టు రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది.
MS Dhoni & Sachin Tendulkar clicked during a shoot😍❤️@msdhoni | @sachin_rt | #Thala pic.twitter.com/mgydrhmZeU
— Anjali ♡ (@imAnjalii718) October 6, 2022