సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 సీజన్ కోసం మార్కరమ్ను కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే. కానీ.. మార్కరమ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ను నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ధనాధన్ ఐపీఎల్కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులు వారి ఫేవరేట్ టీం మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ నెల 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తో ఐపీఎల్ 2023 మొదలుకానుంది. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులను ఓ విషయం ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు దూరం కానున్నారు. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ రీషెడ్యూల్ ఇందుకు కారణం అని తెలుస్తుంది. దీని ప్రకారం స్వదేశంలో నెదర్లాండ్స్ మీద దక్షిణాఫ్రికా మార్చ్ 31, ఏప్రిల్ 2న రెండు వన్డేల సిరీస్ ఆడనుంది. దీంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడే ప్లేయర్లు వారి వారి జట్లకు తమ తొలి మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. ఈ క్రమంలో డికాక్, రబడా, మార్కరమ్, మిల్లర్, స్టబ్స్, జెన్సన్, వాండర్ డస్సెన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు దూరమవ్వడం అన్ని జట్లకు లోటే అయినప్పటికీ.. సన్ రైజర్స్ కి మాత్రం ఈ విషయం కొంచెం ఎక్కువగా ఆందోళనకి గురి చేస్తోంది. ఎందుకంటే ఎయిడెన్ మార్కరమ్ ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఇటివల మార్కరమ్ను తమ కెప్టెన్గా సన్రైజర్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో తొలి మ్యాచ్లకు మార్కరమ్ దూరం అయితే.. సన్రైజర్స్ను ఎవరు నడిపిస్తారనే విషయంపై ఆసక్తినెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 2న సన్రైజర్స్, రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు మార్కరమ్తో పాటు బౌలింగ్ ఆల్ రౌండర్ జన్సెన్ కూడా అందుబాటులో ఉండడం లేదు. మళ్లీ తిరిగి ఏప్రిల్ 4న వాళ్లిద్దరూ జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2న సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు మార్కరమ్ అందుబాటులో లేని కారణంగా ఆ మ్యాచ్కు భువీ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే.. ఇటివల సౌతాఫ్రికా వేదికగా జరిగి సౌతాఫ్రికా టీ20 లీగ్లో మార్కరమ్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించి, తొలి సీజన్లోనే ఆ జట్టును ఛాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. మరి మార్కరమ్ తొలి మ్యాచ్కు దూరం అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
📰: Captain Aiden Markram, Heinrich Klassen and Marco Jansen won’t be available for our April 2nd IPL opener Match against Rajasthan Royals. (According to EspnCricinfo)
#SRH | #OrangeArmy𓅃 | #OrangeArmy | #IPL2023 pic.twitter.com/EwyhgDjwZq
— Orange Army (@OrangeArmyIPL) March 9, 2023