పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రగా సేవలందిస్తూనే మనోజ్ తివారీ.. అటు బెంగాల్ టీమ్ లో క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. జట్టులో ఏదో నామమాత్రపు సభ్యుడిగా కొనసాగడం కాదు.. వరుస శతకాలతో మనోజ్ తివారి మంచి జోష్ లో ఉన్నాడు. జార్ఖండ్ తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్స్ లో తొలి ఇన్నింగ్స్ లో 73 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో శతకంతో రెచ్పిపోయిన మనోజ్ తివారీ.. సెమీస్ లోనూ అదే జోష్ కొనసాగిస్తున్నాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలుతున్న సమయంలో తొలి ఇన్నింగ్స్ లో మనోజ్ తివారి అడ్డుగా నిలబడ్డాడు. 211 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. మనోజ్ తో పాటు కలిసి షబాజ్ అహ్మద్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 209 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 116 పరుగులు చేశాడు.
అయితే మనోజ్ తివారీ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 29వ శతకం నమోదు చేసిన తర్వాత చాలా కొత్తగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనోజ్ తివారీ సెంచరీ సెలబ్రేషన్ వైరల్ గా మారింది. శతకం కొట్టిన తర్వాత మనోజ్ తివారీ జేబులోంచి హ్యాండ్ రైటింగ్ తో ఉన్న ఓ లెటర్ బయటకు తీశాడు. ఆ లెటర్ లో ‘ఐ లవ్ యూ సుస్మితా.. మై స్వీట్ హార్ట్’ అంటూ రాసుంది. క్రికెట్ హిస్టరీలో బెంగాల్ మంత్రి మనోజ్ తివారి సెలబ్రేట్ చేసుకున్నట్లు మరెవరో చేసుకుని ఉండరు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనోజ్ సెలబ్రేషన్, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Manoj Tiwari had a special hand-written message for his family after scoring his 29th first-class hundred 👨👩👧👦
📸: BCCI Domestic #ranjitrophy #bcci #cricketindia #CricketTwitter pic.twitter.com/Upj2x8yGyd
— Sportskeeda (@Sportskeeda) June 16, 2022
మ్యాచ్ విషయానికి వస్తే.. సెమీస్ లో తొలి ఇన్నింగ్స్ లో బెంగాల్ జట్టు 273 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 341 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత సెకంట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు.. 57 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 148/2 పరుగులు చేసి 216 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మనోజ్ తివారీ సెంచరీ సెలబ్రేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.