టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ సెంచరీ చేసి చాలా కాలం అయింది. గత ఐపీఎల్ లోను పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కోహ్లి ఫామ్ లేకపోవడంపై చాలామంది విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా విరాట్ కోహ్లి ఫామ్ పై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ లాంటి ఆటగాడు సెంచరీ లేకుండా చాలాకాలం గడవడం బాధగా ఉందని కపిల్ అన్నారు. ఇది తనతో పాటు భారత్ క్రికెట్ అభిమానులకు ఆందోళన గురిచేస్తోందని తెలిపారు.
కోహ్లి ఫామ్ గురించి కపిల్ స్పందిస్తూ.. “సెంచరీ చేయడానికి కోహ్లీ వంటి గొప్ప ఆటగాడు ఇన్ని రోజులు టైమ్ తీసుకోవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. మనకు అతడు స్టార్ హీరో వంటివాడు. గతంలో మనం సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్ల ఆటను ఇతరులతో పోల్చలేమని అనుకున్నాం.. కానీ కోహ్లీ వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం మారింది. అతడు తన బ్యాటింగ్ విన్యాసాలతో దిగ్గజ ఆటగాళ్లతో పోల్చేలా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు రెండేండ్లుగా అతడు సెంచరీ కోసం తంటాలు పడటం చూస్తుంటే నాకు బాధగా ఉంది.. విరాట్ ఆడినంత క్రికెట్ నేను ఆడలేదు. అయినా ఓ మాజీ క్రికెటర్ గా ఆటతీరు సరిగ్గా లేని ఆటగాళ్లపై విమర్శించే మాకు ఉంటుంది. నేను కోహ్లీ ఆడినంత క్రికెట్ ఆడలేదు.
అయినా ఆట గురించి తెలిసినప్పుడు ఆటగాళ్లను విమర్శించే హక్కు మాకుంటుంది. మేము కూడా క్రికెట్ ఆడాం. మేం కూడా ఆట గురించి అర్థం చేసుకున్నాం. మీరు పరుగులు చేయకపోతే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందనుకుంటారు. అభిమానులు మీ ఆటతీరును మాత్రమే చూస్తారు. అది సరిగ్గా లేకుంటే వారు మౌనంగా ఉంటారని ఆశించవద్దు. అందుకే మీ బ్యాట్, ప్రదర్శన మాత్రమే మాట్లాడాలి. అంతే.. అంతకుమించి ఏమీలేదు” అని కపిల్ దేవ్ అన్నారు. మరి.. కోహ్లీపై కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.