గత కొంతకాలంగా టీమిండియా బౌలింగ్ దళం దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. దాంతో వరుసగా మెగాటోర్నీల్లో ఇంటిదారి పట్టింది భారత జట్టు. దీనికి ప్రధాన కారణం టీమిండియా బౌలింగ్ వెన్నముక్క అయిన జస్ప్రీత్ బూమ్రా గాయపడటమే. కొన్ని నెలల క్రితం వెన్నునొప్పి కారణంగా బూమ్రా భారత జట్టుకు పూర్తిగా దూరం అయ్యాడు. బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమిలో చికిత్స తీసుకుంటున్న బూమ్రా.. ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించినట్లు బీసీసీఐ తెలిపింది. త్వరలోనే శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కు అందుబాటులోకి వస్తాడని కూడా పేర్కొంది. దాంతో మూడు నెలల సుదీర్ఘ కాలం తర్వాత బూమ్రా జట్టులోకి అడుగుపెడుతున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం జట్టులో బూమ్రా లేకపోవడమే.. అని చాలా మంది క్రీడానిపుణులు చెప్పుకొచ్చారు. అయితే వెన్ను నొప్పి కారణంగా బూమ్రా మూడు నెలలుగా NCAలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడని అకాడమీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక తాజాగా జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో బూమ్రాపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ చర్చలో అతడు పూర్తి స్థాయి ఫిట్ నెస్ లోకి వచ్చాకే జట్టులోకి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే గత వారం నుంచి బూమ్రా అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తున్నాడని, అతడు ఎన్సీఏ పెట్టిన అన్ని టెస్టుల్లో మెరిట్ సాధించాడని పేర్కొన్నాయి. ఎన్సీఏ నుంచి ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాగానే.. బూమ్రా శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ లోకి అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ చెప్పుకొచ్చింది. దాంతో టీమిండియా బౌలింగ్ దళం బలంగా మారనుంది. బూమ్రా లేకపోవడంమే టీమిండియా ఓటములకు కారణం అని చాలా మంది క్రికెట్ అభిమానులు, క్రీడా విశ్లేషకులు చెప్పుకొచ్చిన నేపథ్యంలో బూమ్రా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్త వారిలో సంతోషాన్ని రేకెత్తిస్తోంది.
NEWS – The All-India Senior Selection Committee has included pacer Jasprit Bumrah in India’s ODI squad for the upcoming Mastercard 3-match ODI series against Sri Lanka.
More details here – https://t.co/hIoAKbDnLA #INDvSL #TeamIndia
— BCCI (@BCCI) January 3, 2023