సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022 సీజన్ను ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్ విషయంలో తీవ్ర దుమారం రేగింది. బంతి గ్రౌండ్కు తగిలినట్లు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంపై SRH ప్లేయర్లు మండిపడుతున్నారు. మ్యాచ్ ముగిసినా తర్వాత కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టేలేదని ఆ జట్టు ఆటగాళ్లు మేనేజ్మెంట్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం చాలా పెద్దది అయినట్లు తెలుస్తుంది. దీంతో ఏకంగా బీసీసీఐ రంగంలో దిగినట్లు సమాచారం.
ఆ మ్యాచ్లో విలియమ్సన్.. ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన హైపిచ్ బంతిని డిఫెన్స్ ఆడాడు. అది కాస్తా కుడివైపు స్లిప్స్లో గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ కుడివైపునకు డైవ్ చేసినప్పటికీ.. దాన్ని అందుకోలేకపోయాడు. తొలుత శాంసన్ గ్లోవ్స్లో పడి మళ్లీ గాల్లోకి లేచిన ఆ బంతిని స్లిప్స్లో ఉన్న దేవ్దత్ పడిక్కల్ ముందుకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. అతని చేతుల్లోకి వెళ్లకముందే ఆ బాల్ గ్రౌండ్ను తాకిందనేది రీప్లేలో స్పష్టంగా కనిపించింది. పిచ్ అయి లేచిన తరువాత బంతిని పడిక్కల్ అందుకున్నాడనేది రీప్లేలో స్పష్టంగా కనిపించినప్పటికీ.. థర్డ్ అంపైర్ అవుట్గా ప్రకటించడం వివాదాన్ని రేపింది.
దీనిపై సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ స్పందించింది. బీసీసీఐకి లేఖ రాసింది. తన అభ్యంతరాన్ని తెలియజేసింది. వీడియో క్లిప్స్, వివిధ కోణాల్లో నుంచి తీసిన ఫొటోలు, కేప్టెన్ రిపోర్ట్ను తన లేఖకు జత చేసింది. తమ జట్టు కేప్టెన్ అవుట్పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేసింది. లేఖ రాసిన విషయాన్ని హెడ్ కోచ్ టామ్ మూడీ నిర్ధారించారు. మరి దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.