ప్రస్తుతం ఐపీఎల్ 15వ సీజన్ మంచి జోరు మీద నడుస్తోంది. రెండు బిగ్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆటతో పాటు వివాదంతో బాగా హైలెట్ అయింది. మ్యాచ్ చివరి ఓవర్లో జరిగిన హైడ్రామా.. టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్గా మారింది. మ్యాచ్ చివరి ఓవర్లో ఢిల్లీకి విజయం కోసం 36 పరుగులు అవసరం అయ్యాయి. ఆ ఓవర్ మెకాయ్ వేయగా.. తొలి మూడు బంతులను ఢిల్లీ ఆల్రౌండర్ రోవ్మెన్ పావెల్ సిక్సులుగా మలిచాడు.
మూడో బంతి ఫుల్ టాస్గా వచ్చింది. అది బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం దాన్ని నోబాల్గా ప్రకటించలేదు. డగౌట్లో కూర్చున్న ఢిల్లీ టీం అది నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు. అలాగే పావెల్ సైతం అంపైర్ వద్దకు వెళ్లి.. నా నడుము కంటే ఎత్తులో వచ్చింది అది కంప్లీట్ నోబాల్.. మీరు నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్తో వాదించాడు. కానీ నితిన్ మీనన్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. అది ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు. దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి సైగచేశాడు.పావెల్, కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇంతలో షేన్ వాట్సన్ పంత్ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. అప్పటికే తన లయ దెబ్బతిన్న పావెల్ తర్వాతి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టలేదు. ఆఖరి బంతికి ఔటయిపోయాడు. దీంతో రాజస్థాన్ గెలిచింది. ఈ వివాదంలో పంత్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. లీగ్ మ్యాచ్ కోసం అంతలా క్రీడాస్ఫూర్తికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరైంది కాదని క్రికెట్ నిపుణులు అంటున్నారు. రిషభ్ పంత్కు భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందే సూచనలు ఉన్నాయి. అలాంటి ఆటగాడు ఇలా సహనం కోల్పోయి ప్రవర్తించడంతో అతని మానసిక సమర్థత, స్థితి ప్రగ్నతపై విమర్శలు వస్తున్నాయి.
యువ క్రికెటర్ కాబట్టి ఆ మాత్రం ఆవేశం ఉంటడం సహజం కానీ.. మ్యాచ్ను అర్థం లేని విధంగా నిలిపివేయాలనుకోవడం సమంజసం కాదు. ఐపీఎల్ లాంటి ప్రవేట్ టోర్నీకే పంత్ ఇంతలా రియాక్ట్ అయితే.. వరల్డ్ కప్ ఫైనల్స్ లాంటి నరాలు తెగే ఉత్కంఠ, దేశం మొత్తం చూస్తుందనే ఒత్తిడిలో పంత్ ఎలా ప్రవర్తిస్తాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ కప్ లాంటి వేదికపై ఇలాంటి ప్రవర్తనతో దేశం పరువుపోవడం ఖాయమని కొంతమంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో ఉండే ఒత్తిడి, టెన్షన్, ఉత్కంఠ అంతర్జాతీయ మ్యాచ్లలో వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎంతో సహనం ఉంటే కానీ.. అలాంటి సందర్భాల్లో తట్టుకోలేరు. సో.. పంత్ భవిష్యత్తులో టీమిండియాను విజయవంతంగా నడిపించాలని అనుకుంటే.. కొంత ఓర్పును, నేర్పును చూపించాల్సిన అవసరం ఎంతైన ఉందని క్రికెట్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పంత్ చేసింది తప్పే! కానీ.. ఈ చెత్త అంపైరింగ్ ఏంటి?
Crazy 🤯🤯🤯 pic.twitter.com/JCcWZd9Tg6
— Sehwag (@Sehwag54587220) April 22, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.