ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 పరుగులు చేసిన లలిత్ యాదవ్.. విజయ్ శంకర్ బౌలింగ్ లో రనౌట్గా వెనుదిరిగాడు. అయితే అతను రనౌట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్ విజయ్ శంకర్ వేశాడు. మొదటి రెండు బంతుల్లో రెండు ఫోర్లు బాదిన పంత్.. ఆ ఓవర్ నాలుగో బంతిని లెగ్సైడ్ దిశగా ఆడాడు. సింగిల్కే అవకాశమున్నప్పటికి పంత్ అనవసరంగా రెండో పరుగుకు యత్నించాడు. కాగా బంతిని అందుకున్న అభినవ్ మనోహర్ విజయ్ శంకర్కు త్రో విసిరాడు. లలిత్ యాదవ్ క్రీజులోకి చేరేలోపే విజయ్ శంకర్ వికెట్లను గిరాటేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: SRHలో కొత్త వివాదం! ఆటగాళ్ల నిరసన.. రంగంలోకి BCCIబంతి అందుకోవడానికి ముందే విజయ్ శంకర్ తన కాలితో పొరపాటున వికెట్లను తన్నడంతో ఒక బెయిల్ కిందపడింది. అప్పటికే బంతి విజయ్ శంకర్ చేతిలో పడడం.. వెంటనే వికెట్లను గిరాటేయడం జరిగిపోయాయి. ఇది గమనించిన పంత్ కాస్తాకన్ఫ్యూజ్ అయ్యాడు. అంపైర్ వద్దకు వచ్చి మరోసారి రనౌట్ను పరిశీలించాలని కోరాడు.
Fair dismissal, but unlucky for Lalit Yadav that run out.
Acc to laws, if only one bail is off by external touch, it’s suffice to take off the other bail. Had the other bail also come off when Shankar stepped on, he’d have to uproot the stumps, by when Lalit might have made it. pic.twitter.com/fsVuzcXVEW
— Rohit Sankar (@imRohit_SN) April 2, 2022
అయితే అంపైర్లు విజయ్ శంకర్ ముందే వికెట్లను తన్నినప్పటికి.. లలిత్ యాదవ్ను రనౌట్ చేసే సమయానికి బంతి అతని చేతిలోనే ఉందని.. కాబట్టి అది ఔటేనని వివరించారు. దీంతో చేసేదేం లేక లలిత్ యాదవ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విజయ్ శంకర్ చేసిన రనౌట్ కరెక్టేనా అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ అవుట్ పై వివాదం నడుస్తుండడంతో.. ఇది మరింత అగ్గి రాజేస్తోంది.
ఇది కూడా చదవండి: జట్టు మారినా రాత మారలేదంటూ విజయ్ శంకర్ పై సెటైర్లు!