ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ గర్ల్ఫ్రెండ్ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో .. 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 124 చేసింది. 14 ఓవర్ రెండో బంతికి మనీష్ పాండే 38 పరుగుల వద్ద మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్.. తను ఎదుర్కొన్న తొలి బంతిని 104 మీటర్ల భారీ సిక్సర్గా మలిచాడు. వెంటనే.. తన ప్రేయసి కూర్చున్న వైపు తిరిగిన స్టోయినిస్ చిరునవ్వుతో థంబ్స్ అప్ చేస్తూ.. ”ఈ సిక్సర్ నీకే అంకితం” అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన స్టోయినిస్ గర్ల్ఫ్రెండ్ ఒక క్యూట్ స్మైల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. అనంతరం.. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: షమీ క్యాచ్ పట్టలేదని ఓ చించుకున్నావ్.. మరి నీకేమైంది పాండ్యా?