ఐపీఎల్ 2022 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం పుణే వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ జంట స్టాండ్స్లో లిప్ కిస్ పెట్టుకున్నారు. మైదానంలో అంత మంది ఉన్నా, వారి చుట్టు పక్కల ఉన్న వారు చూస్తున్నా.. వారినెవరిని పట్టించుకోకుండా ఆ జంట కాసేపు ముద్దులాటలో మునిగిపోయింది. ఈ లోకంతో తమకు సంబంధం లేదన్నట్టుగా తమ ముద్దుల పరువశంలో తేలియాడారు. వారిని చూసి చుట్టు పక్కల వాళ్లైనా పక్కకు వెళ్లారు తప్పితే వాళ్లు మాత్రం అక్కడే ఉండి తమ ముద్దులాటను కొనసాగించారు. అయితే ఈ సంఘనను ఓ కెమెరామెన్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఆ జంట ముద్దులాట చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లతో మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ జంట ఐపీఎల్ స్థాయిని మరో లెవల్కు తీసుకెళ్లిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్లో కిస్ క్యామ్ కొత్తగా ప్రవేశపెట్టబడిందని ఫన్నీగా రాసుకొచ్చారు. ఇక మరొకొందరైతే ఈ జంట ముద్దులాటను కవర్ చేసిన కెమెరామెన్ పని తనాన్ని మెచ్చుకుంటున్నారు. అంత కరెక్ట్ గా.. నీకు ఎలా కనపడుతున్నాయి కెమెరామెన్ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.
*Me start Watching ipl with my family*
That one couple:- pic.twitter.com/hG4tlzMKr0
— Pintukumar (@Kumarpintu12171) April 2, 2022
Current Situation of World #RussiaUkraineWar#IPL2022 #GTvsDC #PuneCouple https://t.co/XOKrRpnEHQ pic.twitter.com/PL1cdLhtQs
— Dhananjay Jha (@DhananjayHans) April 2, 2022
This couple took the IPL Match to next level😂 #DCvsGT #IPL2022#PuneCouple pic.twitter.com/rQi3YbupGW
— Dhananjay Jha (@DhananjayHans) April 2, 2022
ఇది కూడా చదవండి: SRH అడ్మిన్ పై నెటిజన్లు సెటైర్లు.. ఉగాది స్వాగ్ అంటూ మార్కరమ్ పంచకట్టు..