టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్తో ఇండియా మహారాజాస్ జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. గురువారం ప్రారంభమైన లెజెండ్స్ క్రికెట్ లీగ్లో ఇండియా, మహారాజాస్, ఆసియా లయన్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఇండియా మహారాజాస్ జట్టు ఘన విజయం సాధించింది. భారత మాజీ ఆటగాళ్లంతా ఇండియా మహారాజాస్ టీమ్ తరఫున బరిలోకి దిగగా, ఆసియాలోని ఇతర దేశాల మాజీలంతా ఆసియా లయన్స్ తరఫున బరిలోకి దిగారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ శ్రీలంక మాజీ క్రికెటర్ ఉపుల్ తరంగా హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. తరంగ 7 ఫోర్లు, 2 సిక్స్లతో 46 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. అతనికి తోడుగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్, లయన్స్ కెప్టెన్ మిష్బా 30 బంతుల్లోనే 44 పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్, 4 సిక్స్లు ఉన్నాయి. ఇక హఫీజ్ 16 పరుగులు చేయగా మిగతావారెవరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. ఇండియా మహారాజాస్ బౌలర్లలో మన్ప్రీత్ గోనీ 3 వికెట్లతో సత్తా చాటాడు. మిగతా వారిలో ఇర్ఫాన్ పఠాన్ 2, స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్ తలో వికెట్ తీశారు.
No surprises, Yusuf Pathan is the legend of the match for his blistering 80 runs off just 40 balls.
📸: Sony Sports#IndiaMaharajas #AsianLions #LegendsLeagueCricket #LLC2022 #CricTracker #YusufPathan pic.twitter.com/Z46kEvg79M
— CricTracker (@Cricketracker) January 20, 2022
176 పరుగుల టఫ్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 17 పరుగుల వద్ద ఉండగా 10 పరుగులు చేసిన ఓపెనర్ స్టువర్ట్ బిన్నీని షోయబ్ అక్తర్ దెబ్బ కొట్టాడు. అనంతరం 26 పరుగుల వద్ద బద్రినాథ్ డకౌట్ అయ్యాడు. 34 పరుగుల వద్ద 20 పరుగులు చేసిన ఓపెనర్ నమాన్ ఓజాను ఉమర్ గుల్ ఫెమిలియన్ చేర్చాడు. దీంతో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా మహారాజస్ను కెప్టెన్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు ఏకంగా 117 పరుగులు జోడించారు.
#YusufPathan Boom#LegendsLeagueCricket pic.twitter.com/HoOBP332PI
— Kashmir Sports Watch (@Ksportswatch) January 20, 2022
యూసుఫ్ పఠాన్ ఫోర్లు, సిక్స్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 151 పరుగుల వద్ద ఉండగా 80 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్ రనౌట్ అయ్యాడు. అనంతరం ఇర్ఫాన్ పఠాన్తో కలిసి కెప్టెన్ మహ్మద్ కైఫ్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఆసియా లయన్స్పై ఇండియా మహారాజస్ 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లు ఇంత యాక్టివ్గా క్రికెట్ ఆడడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మ్యాచ్పై, యూసుఫ్ పఠాన్ ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rawalpindi Express @shoaib100mph strikes 🔥#IndiaMaharajas #AsianLions #LegendsLeagueCricket #LLC2022 #CricTracker #ShoaibAkhtar pic.twitter.com/W6sydgf1TV
— CricTracker (@Cricketracker) January 20, 2022