బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా విజయం కోసం ఎదురీదుతోంది. బంగ్లాదేశ్ను రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకే అవుట్ చేయడంతో టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. కేవలం 145 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్ను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. టార్గెట్ అంత పెద్దగా లేకపోయినా.. బంగ్లాదేశ్ బౌలర్లు భారత టాపార్డర్ను కుప్పకూల్చి.. మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చారు. మూడో రోజు ఆటముగిసే సమయానికి.. టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 45 పరుగుల వద్ద ఉంది. రెండో టెస్టులో విజయానికి మరో 100 పరుగులు కావాలి. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నా.. నాలుగో రోజు సైతం బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తే.. మ్యాచ్ మరింత ఇంట్రస్టింగ్ మారే అవకాశం.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 227 పరుగుల మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఉమేష్ యాదవ్ 4, అశ్విన్ 4, జయ్దేవ్ ఉనద్కట్ 2 వికెట్లు తీసి.. బంగ్లాను తక్కువ స్కోర్కే కట్టడి చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్కు దిగిన టీమిండియాను సైతం బంగ్లా బౌలర్లు ఆరంభంలో కట్డిడి చేశారు. టాపార్డర్ను త్వరగానే పెవిలియన్ చేర్చారు. కేఎల్ రాహుల్ 10, శుబ్మన్ గిల్ 20, పుజారా 24, కోహ్లీ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ.. రిషభ్ పంత్ 93, శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో రాణించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు చేసింది. ఇక బంగ్లాదేశ్ను రెండో ఇన్నింగ్స్లోనూ టీమిండియా బౌలర్లు 231 పరుగులకే ఆలౌట్ చేసి.. బ్యాటర్ల పని సులువు చేశాడు.
అక్షర్ పటేల్ 3, సిరాజ్ 2, అశ్విన్ 2, ఉనద్కట్, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీసి.. బంగ్లాదేశ్ను ఆలౌట్ చేశారు. దీంతో టీమిండియా ముందు కేవలం 145 పరుగుల టార్గెట్ మాత్రమే నిలిచింది. ఈ టార్గెట్ను భారత బ్యాటర్లు ఊదిపడేస్తారుకుంటే.. మూడో రోజు చివరి సెషన్ ఆటలో పెవిలియన్కు క్యూ కట్టారు. తొలుత కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులు చేసి అవుట్ కాగా.. తర్వాత పుజారా 6 రన్స్ చేసి వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత.. బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతుంటే.. ఓపెనర్ శుబ్మన్ గిల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ.. డిఫెన్స్కే ప్రాధాన్యత ఇస్తూ.. బ్యాటింగ్ చేసి.. 20 బంతులాడి ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. దీంతో.. టీమిండియా 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం అక్షర్ పటేల్ 26 రన్స్తో.. నైట్ వాచ్మెన్గా వచ్చిన జయ్దేవ్ ఉనద్కట్ 3 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. అయితే.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ టెస్టు సిరీస్లో దారుణంగా విఫలం అయ్యారు. మరి వారి బ్యాటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Stumps on Day 3️⃣ of the second #BANvIND Test.#TeamIndia move to 45/4 & require 100 runs to win with @akshar2026 & @JUnadkat at the crease.
Scorecard – https://t.co/CrrjGfXPgL pic.twitter.com/d9w83R8qLt
— BCCI (@BCCI) December 24, 2022