బోర్డర్ గావస్కర్ ట్రోఫీని టీమిండియా, అద్భుతమైన విజయంతో ప్రారంభించిది. నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టుని మూడు రోజుల్లోనే ముగించేసింది. సిరీస్ లో 1-0 ఆధిక్యంతో నిలిచింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. నాలుగు టెస్టుల సిరీస్ స్టార్ట్ కావడానికి ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చాలా గొప్పులు చెప్పారు. తీరా తొలి టెస్టులోనే ఘోరంగా చేతులెత్తేశారు. నాగ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ మూడో రోజుకే ముగిసింది. టీమిండియా అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. స్పిన్నర్నలు అయితే రెచ్చిపోయి మరీ పోటాపోటీగా వికెట్లు తీశారు. దీంతో భారత్ జట్టు.. ఆసీస్ పై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఇక సిరీస్ లో 1-0 ఆధిక్యంలోనూ నిలిచింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు మన పేసర్లు స్టార్టింగ్ లో వణుకు పుట్టించారు. టపటపా వికెట్లు తీసేశారు. అలా ఓపెనర్లు వార్నర్-ఖవాజా ఇద్దరూ 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యారు. ఆ తర్వాత ట్రాక్ లోకి వచ్చిన స్పిన్నర్లు.. మిగతా బ్యాటర్ల వికెట్లు తీసేశారు. మరీ ముఖ్యంగా దాదాపు ఆరు నెలల తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చిన జడేజా.. తొలి మ్యాచులోనే ఐదు వికెట్ల ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం టీమిండియా బ్యాటింగ్ మొదలుపెట్టింది.
మన జట్టులో కెప్టెన్ రోహిత్ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులతో ఆకట్టుకున్నారు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. దీంతో 400 పరుగులకు ఆలౌటైపోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు మన స్పిన్నర్లు చెమటలు పట్టించారు. ఫలితంగా 91 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్.. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17-21 మధ్య దిల్లీ వేదికగా జరగనుంది. మరి మూడు రోజుల్లో తొలి టెస్టు ముగిసిపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
𝗩𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝗡𝗮𝗴𝗽𝘂𝗿! #TeamIndia 🇮🇳 win by an innings & 1️⃣3️⃣2️⃣ runs and take a 1️⃣-0️⃣ lead in the series 👏🏻👏🏻
What a start to the Border-Gavaskar Trophy 2023 👌🏻
Scorecard ▶️ https://t.co/SwTGoyHfZx…#INDvAUS | @mastercardindia pic.twitter.com/jCVDsoJ3i6
— BCCI (@BCCI) February 11, 2023