భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ ఆసక్తే వేరు. అది మెన్స్ అయినా.. ఉమెన్స్ అయినా దాయాధి జట్లు తలపడే ఆ మ్యాచులకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహిళల ప్రంపచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 107 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. లేడీ ధోని అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
పాక్ ఇన్నింగ్స్ లో 30 ఓవర్ వేసిన రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్లో.. అలియా రియాజ్ కాస్త క్రీజును వదిలి భారీ షాట్కు ప్రయత్నించింది. అయితే అది మిస్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిచా చేతుల్లోకి వెళ్ళింది.. వెంటనే రిచా మెరుపు వేగంతో స్టంప్స్ను పడగొట్టింది. దీంతో అలియా రియాజ్ పెవిలియన్కు చేరక తప్పలేదు. ఇక రిచా స్టంపింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిచా స్టంపింగ్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా లేడీ ధోని అంటూ.. రిచాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. రిచా ఘోష్ ఈ మ్యాచ్లో నాలుగు క్యాచ్లు కూడా పట్టింది. దీంతో ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఔట్లు చేసిన తొలి క్రికెటర్గా రిచా నిలిచింది.