ఆసియా కప్ ఆవిష్కరణలో పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ టీమిండియాని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్ పాక్ మీద ఘోరంగా ఓడిపోయిన ఒక మ్యాచ్ ని గుర్తు చేసాడు.
భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్ లు ఆడడం ఎప్పుడో మానేశాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఐసీసీ టోర్నీల్లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా కనబడుతుంది. ఈ ఏడాది ఆసియా కప్, వరల్డ్ కప్ జరగనుండడంతో ఇరు జట్ల మధ్య కనీసం మూడు నుంచి నాలుగు మ్యాచులు చూసే అవకాశం అభిమానులకి కలుగుతుంది. అక్టోబర్ లో వరల్డ్ కప్ కి ముందే ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఆగస్టు 30 న ప్రారంభం ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియా టైటిల్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. అయితే తమ జట్టు భారత్ కంటే మెరుగైన జట్టని పాకిస్థాన్ దిగ్గజ బ్యాటర్ వకార్ యూనిస్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. గతంలో భారత్ పాకిస్థాన్ మీద ఓడిపోయినమ్యాచ్ ని గుర్తు చేస్తూ టీమిండియాపై నోరు పారేసుకున్నాడు.
ఇండియా- పాకిస్థాన్ జట్లు 2017 లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీలంటే పాకిస్థాన్ ని చిత్తు చేసే భారత్.. ఇంగ్లాండ్ లోని ఓవల్ జరిగిన ఈ ఫైనల్లో పాకిస్థాన్ పై ఘోర పరాజయం పాలైంది. 180 పరుగుల భారీ తేడాతో పాక్ మీద ఓడిపోవడంతో సగటు భారత అభిమాని ఆ మ్యాచ్ ని పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వకార్ యూనిస్ ఖాన్ అర్ధం లేని వ్యాఖ్యలు చేస్తున్నాడు. లాహోర్లో ఆసియాకప్ ట్రోఫీ ఆవిష్కరణలో వకార్ యూనిస్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఇంగ్లాండ్ లోని ఓవల్ లో భారత్ ని చిత్తు చేశామని, టీమిండియాను ఏ గడ్డమీదనైనా ఓడించడం మాకు పెద్ద విషయం కాదని చెప్పుకొచ్చాడు.
వకార్ మాట్లాడుతూ “వీలైనంత సింపుల్గా పాకిస్థాన్ జట్టు ఆడాలి. మేమున్న కాలంలో మేజర్ టోర్నీలో భారత్పై విజయాలు పెద్దగా సాధించలేకపోయాం. ప్రస్తుతం జట్టులోని కుర్రాళ్ళు అదరగొట్టేస్తున్నారు. ఇది పాకిస్థాన్ కి చాలా శుభపరిణామం. ప్రతి ఒక్కరిలో టాలెంట్ పుష్కలంగా ఉంది. ఇదే తరహాలో ఆడితే ఇండియాను ఎందుకు ఓడించలేం?’”అని పాకిస్థాన్ జట్టుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసాడు. ఇక గతేడాది టీ 20ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ ఒక మ్యాచులో గెలిచి మరో మ్యాచులో ఓడిపోయింది. మేజర్ టోర్నీల్లో ఎప్పుడో ఒకసారి విజయం సాధించే పాకిస్థాన్ జట్టుని ఈ దిగ్గజ బౌలర్ భారత్ ని తక్కువగా చేసి మాట్లాడడం ఇప్పుడు ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈసారి టీమిండియాని నిలువరించడం పాక్ కి శక్తికి మించిన పని అని గత టోర్నీలో దురదృష్టం కొద్దీ భారత్ ఓడిపోయింది అని ఈ మాజీ పాక్ బౌలర్ కి వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి వకార్ యూనిస్ ఖాన్ భారత్ ని తక్కువ చేసి మాట్లాడడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.