భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లను చూసేందుకు ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాడు. అలాంటి వారికి గుడ్ న్యూస్. త్వరలో ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి.
ప్రపంచ క్రికెట్లో అత్యంత గొప్ప సమరాల్లో ఒకటిగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లను ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ మ్యాచ్ల ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కూడా పనికిరాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతుంటారు. వరల్డ్ కప్ అనే కాదు.. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగినా వ్యూస్ ఒక రేంజ్లో వస్తాయి. ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రేమికులు టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోతారు. ఇరు జట్లు మ్యాచ్లో గెలిచేందుకు చివరి వరకు పోరాడటంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంటుంది. అందుకే ఈ మ్యాచ్లకు అంత క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఈ ఇరు జట్ల మధ్య చాన్నాళ్లుగా దైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడం క్రికెట్ పైనా ప్రభావం చూపుతోంది.
ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో భారత్, పాకిస్థాన్లు ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్లో ఇరు జట్లు మరోసారి కలపడనున్నాయి. అయితే ఈ టోర్నీకి ముందే ఈ టీమ్స్ మధ్య మూడు మ్యాచ్లు చూసే ఛాన్స్ ఉంది. ఆసియా కప్-2023 రూపంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్లను చూసే వీలుంది. ఇకపోతే, ఈసారి ఆసియా కప్కు దాయాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ భారత జట్టు పాక్లో ఆడేందుకు సిద్ధంగా లేకపోవడంతో ఈ టోర్నీ నిర్వహణపై అనుమానాలు ఏర్పడ్డాయి. భారత్ను ఒప్పించేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అయినా దాయాది వెనక్కి తగ్గలేదు. ఆసియా కప్ తమ దేశంలోనే జరుగుతుందని పాక్ పట్టుదలకు పోయింది. కానీ మిగతా సభ్య దేశాలు ఆ జట్టుకు మద్దతు ఇవ్వలేదు. సభ్య దేశాలు మద్దతు ఇవ్వకపోవడంతో హైబ్రిడ్ మోడల్ను ప్రతిపాదించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).
భారత్ ఆడే మ్యాచ్లను శ్రీలంకలో.. మిగతా మ్యాచ్లను పాక్లో ఆడేందుకు అనుమతించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు పీసీబీ ప్రతిపాదించింది. మొత్తానికి ఈ ప్రతిపాదనకు ఏసీసీ పచ్చజెండా ఊపింది. దీంతో ఆసియ్ కప్ నిర్వహణపై ఏర్పడిన అనుమానాలు తొలగిపోయాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 మధ్య ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ మొత్తంలో 19 మ్యాచ్లు జరగనున్నాయని ఏసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపోతే, ఈ ఆసియా కప్లో మొత్తంగా భారత్, పాక్ జట్లు మూడుసార్లు తలపడే ఛాన్స్ ఉంది. ఇరు టీమ్స్ బాగా ఆడితే ఫైనల్ ఫైట్లో దాయాదుల మధ్య మరో పోరును చూడొచ్చు. మరి.. వరల్డ్ కప్కు ముందే భారత్, పాక్ తలపడే ఆసియా కప్ చూసేందుకు మీరు ఆసక్తిగా ఉన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India and Pakistan can potentially face each other 3 times in the Asia Cup 2023.
The tournament to kick off from 31st August and the Final will be played on 17th September. pic.twitter.com/ITIEyukukN
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 15, 2023