టీమిండియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా టీమ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో అన్ని వైపుల నుంచి ఆసీస్ టీమ్పై విమర్శలు వస్తున్నాయి. అయితే రెండో టెస్టుకు ముందు కంగారూ టీమ్కు ఓ అదిరిపోయే గుడ్న్యూస్ అందింది.
“బోర్డర్-గవాస్కర్” ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. నాగపూర్లో జరిగిన ఈ టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనుకుంటే ఆసీస్ బ్యాటర్ల ఫెయిల్యూర్తో పేలవంగా ముగిసింది. భారత స్పిన్నర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు కంగారూ బ్యాట్స్మన్. అటు డిఫెన్స్ చేయలేక, ఇటు అటాక్ చేయలేక బ్యాట్లు ఎత్తేశారు. ఈ ఘోర ఓటమి నేపథ్యంలో ఆ జట్టు మీద సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ సైతం తమ జట్టు ఆటగాళ్లకు కొంచెం గట్టిగానే క్లాస్ పీకాడు.
‘స్టీవ్ స్మిత్ తన ఆటిట్యూడ్ మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ 400 పరుగులు చేసిన పిచ్లో ఆస్ట్రేలియా ఇలా ఆడటం చాలా బాధాకరం’ అని ఆయన చెప్పుకొచ్చాడు. మరో ఆసీస్ మాజీ ఆటగాడు మార్క్వా కూడా కంగారూల ప్రదర్సనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో కచ్చితంగా తుది జట్టులో మార్పులు చేయాలన్నాడు. పదే పదే విఫలమవుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్కు టీమ్లో ఎందుకు చోటు కల్పిస్తున్నారని మార్క్వా ప్రశ్నించాడు. అతడి స్థానంలో రెండో టెస్టులో ట్రావిస్ హెడ్ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఇక తొలి టెస్ట్లో ఆస్టేలియా ఓటమికి ఎన్ని కారణాలు ఉన్నపటికీ.. తుది జట్టులో మిచెల్ స్టార్క్, హేజల్వుడ్, అల్రౌండర్ కామెరూన్ గ్రీన్ వంటి స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా ఆడలేకపోయారు.
రెగ్యులర్ ప్లేయర్లు ఆడకపోవడంతో ఆసీస్ జట్టులో కొంత సమతుల్యం దెబ్బతింది. మైదానంలో జట్టు బలహీనంగా కనిపించింది. అయితే.. టీమిండియాతో జరగబోయే రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. నాగపూర్లో టెస్టులో ఆస్ట్రేలియా పేసర్లుగా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్తో పాటుగా బొలాండ్ పేస్ బాధ్యతలను పంచుకున్నారు. కానీ.. వీరిద్దరూ కూడా పూర్తిగా నిరాశపరిచారు. కమ్మిన్స్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ తీసుకున్నప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక బొలాండ్కు అయితే ఒక్క వికెట్ కూడా దక్కలేదు. పిచ్ ఏదైనా ఆస్ట్రేలియాకు పేసర్లే బలం. కానీ ఈ విషయంలో ఆస్ట్రేలియా పేసర్లు తీవ్రంగా నిరాశపరిచారు.
ఒకవైపు భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ రెచ్చిపోతుంటే.. మరోవైపు కంగారూ పేసర్లు కమ్మిన్స్, బొలాండ్ మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఈ నేపథ్యంలో ఆసీస్కు ఒక శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే రెండో టెస్టుకు స్టార్క్ అందుబాటులో ఉంటాడని ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అసలే మొదటి టెస్టు ఓటమితో కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియాకు స్టార్క్ అందుబాటులోకి రానుండటం కొంచెం కలిసొచ్చే విషయమే.
మరో పేసర్ హాజెల్ వుడ్, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ విషయంలో ఆడేది లేనిదీ త్వరలో చెబుతామని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పుకొచ్చింది. ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఈ నెల 17న ఢిల్లీలో జరగబోతోంది. ఈ సిరీస్లో టీమిండియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ మీద ఆతిథ్య టీమిండియా కన్నేయగా.. పర్యాటక ఆస్ట్రేలియా రెండో టెస్టులో గెలిచి బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో జట్టులోకి రానున్నాడు స్టార్క్. ఇప్పటివరకు స్టార్క్ టెస్టుల్లో 301 వికెట్లు పడగొట్టాడు. పిచ్ ఏదైనా ప్రభావం చూపగల బౌలర్ అతను. పదునైన యార్కర్లు, అద్భుతమైన పేస్ అతని బలం. అయితే స్టార్క్ రాక.. ఆస్ట్రేలియా జట్టును ఓటముల బారి నుంచి తప్పిస్తుందో లేదో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.