క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో మాజీ సారధి విరాట్ కోహ్లీని పోల్చడం సరికాదని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ(113) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 80 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో వన్డేల్లో 45వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ సరసన చేరాడు. అలాగే, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీ(9)లు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. దీంతో అతని గణాంకాలను సచిన్ గణాంకాలతో పోలుస్తూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
శ్రీలంకపై సెంచరీతో కోహ్లీ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. వన్డేల్లో 45వ, అంతర్జాతీయ క్రికెట్లో 73వ శతకం సాధించిన అతను టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. స్వదేశంలో తక్కువ ఇన్నింగ్స్ల్లో 20 సెంచరీలు కొట్టిన బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. 99 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకుంటే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 160 ఇన్సింగ్స్లు తీసుకున్నాడు. అభిమానులు ఈ విధంగా కోహ్లీ గణాంకాలను సచిన్ గణాంకాలతో పోల్చడం గంభీర్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన గంభీర్, సచిన్ ఓ దిగ్గజం.. అతనితో కోహ్లీని పోల్చడంలో అర్థం లేదంటూ విరుచుకుపడ్డాడు.
Virat Kohli in ODI format:
Innings – 257
Runs – 12584
Average – 57.72
Strike Rate – 93.25
Hundreds – 45
Fifties – 64The Greatest of all-time. pic.twitter.com/t56qKHO2W5
— Johns. (@CricCrazyJohns) January 10, 2023
JUST ✋MORE TO BREAK THE RECORD 👑@sachin_rt | @imVkohli | #INDvSL pic.twitter.com/tbE4j9I8zq
— CricTracker (@Cricketracker) January 10, 2023
కోహ్లీ సెంచరీ చేయడాన్ని సమర్ధించిన గంభీర్, అప్పటి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ ని.. ఇప్పటి ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ తో కంపేర్ చేస్తూ అభిమానులకు కౌంటరిచ్చాడు. అలాగే.. శ్రీలంక బౌలర్లపై కూడా విరుచుకుపడ్డాడు. “విరాట్ను సచిన్తో పోల్చడంలో అర్థం లేదు.. సచిన్ కాలంలో 30 యార్డ్ సర్కిల్లో 5 మంది ఆటగాళ్లు లేరు.. ఎక్కువ మంది బౌండరీ లైన్ వద్దే ఉండేవారు. దీంతో బౌండరీలు చేయడం కష్టమయ్యేది. కానీ, ఇప్పుడలా కాదు.. అందులోనూ శ్రీలంక బౌలర్లలో పసలేదు. లంక బౌలర్లపై భారత టాపార్డర్ బ్యాటర్లు విరుచుకుపడ్డ తీరే అందుకు నిదర్శనం..” అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
Gautam Gambhir 👀#CricTracker #SachinTendulkar #ViratKohli pic.twitter.com/gaecQZSMZn
— CricTracker (@Cricketracker) January 10, 2023
గంభీర్ ఉద్దేశ్యం ప్రకారం.. ఎక్కువమంది ఆటగాళ్లు 30 యార్డ్ సర్కిల్ లోపల ఉండటం వల్లే కోహ్లీ సెంచరీ చేశాడన్నట్లుగా ఉంది. దీంతో కోహ్లీ అభిమానులు గంభీర్ పై విరుచుకు పడుతున్నారు. మీరు విమర్శించని క్రికెటర్ ఎవరైనా ఉన్నారా! అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గౌతం గంభీర్ గురుంచి అందరకి తెలిసిందే. కీలక మ్యాచుల్లో అతడు విలువైన పరుగులు చేసినా తగిన గుర్తింపు రాకపోవడమే అందుకు కారణం. అందుకే.. మాజీ సారధి ధోనీని ఉద్దేశిస్తూ అప్పుడప్పుడు ఛలోక్తులు విసురుతుంటాడు. గంభీర్ వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.