దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అపూర్వ విజయం సాధించింది. పాకిస్థాన్ను వారి సొంతగడ్డపై మూడు టెస్టుల సిరీస్లో వైట్ వాష్ చేసి కొత్త చరిత్ర లిఖించింది. కొంత కాలంగా టెస్టు క్రికెట్ను టీ20 స్టైల్లో ఆడుతున్న ఇంగ్లండ్.. మరోసారి అదే వేగంతో పాక్ను మట్టికరిపించింది. ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కాంబినేషన్లో బజ్బాల్ స్ట్రాటజీతో ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది ఇంగ్లండ్. అయితే.. పాకిస్థాన్ను వారి సొంత మైదానాల్లో ఓడించడం విశేషం. పైగా మూడు టెస్టుల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడంతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించనే చెప్పాలి.
ఈ సిరీస్ ఇంగ్లండ్ యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్తో పాటు హ్యారీ బ్రూక్, అరంగేట్రం ప్లేయర్ రెహాన్ అహ్మద్ లాంటి వారితో పాటు అందరి కంటే మోస్ట్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ సైతం ఈ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. కరాచీ వేదికగా జరిగిన చివరిదైన మూడో టెస్టులో పాకిస్థాన్పై ఇంగ్లండ్ టీ20 స్టైల్ బ్యాటింగ్తో దుమ్మురేపింది. కేవలం నాలుగురోజు కొన్ని నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 304 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ 78 రన్స్తో పాటు అఘా సల్మాన్ 56 పరుగులతో రాణించడంతో పాక్ ఆ స్కోర్ చేయగలిగింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, యువ బౌలర్ రెహాన్ అహ్మద్ 2 వికెట్లతో సత్తా చాటారు.
ఇక ఇంగ్లండ్ను సైతం తొలి ఇన్నింగ్స్తో 354 పరుగులకే పాకిస్థాన్ కట్టడి చేయగలిగింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు బాదిన హ్యారీ బ్రూక్ ఈ మ్యాచ్లోనూ సెంచరీ బాది అదరగొట్టాడు. 111 రన్స్తో రాణించాడు. 50 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్కు ఇంగ్లండ్ డెబ్యూ బౌలర్ రెహాన్ అహ్మద్ చుక్కలు చూపించాడు. అతి చిన్ని వయసులో ఐదు వికెట్ల హాల్ సాధించి.. కొత్త చరిత్ర సృష్టించాడు. అతని ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్లో 216 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ముందు కేవలం 167 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్క కేవలం 28.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. నిజానికి మూడో రోజే మ్యాచ్ను ముగించాలని భావించిన ఇంగ్లండ్ ఓపెనర్లు.. జాక్ క్రాలే, బెన్ డకెట్ టీ20 స్టైల్లో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
తొలి ఆరు ఓవర్లలోనే ఆ జోడీ 58 పరుగుల బాది టెస్టు క్రికెట్ ఆడుతున్న విషయాన్ని మర్చిపోయేలా చేశారు. ఇక మూడో రోజు ఓవర్లు అయిపోవడంతో.. 53 పరుగుల కోసం నాలుగో రోజు ఉదయం కొన్ని ఓవర్లు ఆడి.. ఇంగ్లండ్ ఏకంగా 8 వికెట్ల తేడాతో మూడో టెస్టులో గెలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత పాక్లో జరిగిన టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో కైవసం చేసుకుంది. అంతకు ముందు రావాల్సిండి వేదికగా జరిగిన మ్యాచ్లో 74 పరుగులతో తేడాతో, ఆ తర్వాత ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కేవలం 26 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి ఇంగ్లండ్ 3-0తో పాక్ను వైట్వాష్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🎙️ “ Amazing Series !! At the end it’s all about cricket 🏏 ” 🇵🇰🤝🏴#ENGvsPAK #PAKvsENG pic.twitter.com/DVyLItLoky
— 🦋 Mee23 🙂 🦋 (@2_Meenu23) December 20, 2022