భార్యల చేతుల్లో మోసపోయిన క్రికెటర్ల లిస్టులో ఇద్దరు స్టార్లు ఉన్నారు. అందులో ఒకరు భారత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కాగా, మరొకరు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్.
క్రికెట్ ఆడే దేశాలు ఎన్నో ఉన్నప్పటికీ జెంటిల్మన్ గేమ్కు ఎక్కువ పాపులారిటీ ఉన్నది మాత్రం ఆసియా దేశాల్లోనే. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లో క్రికెట్ను ఒక మతంగా ఆరాధించే వారు కోట్లాది మంది ఉన్నారు. అందుకే ఆయా దేశాల్లో క్రికెటర్లకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్. క్రికెటర్ల విషయంలో వాళ్ల ఆటతీరుతో పాటు పర్సనల్ లైఫ్లోని అంశాలు కూడా హైలైట్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు? వాళ్లకు బ్రేకప్ అయిందా? ఏ క్రికెటర్ ఎవర్ని పెళ్లాడాడు లాంటి విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే భార్యల చేతుల్లో మోసపోయిన క్రికెటర్లు కూడా ఉన్నారని మీకు తెలుసా? ఈ లిస్టులో ఉన్న క్రికెటర్ల భార్యలు డివోర్స్ తీసుకొని తమ భర్త స్నేహితుడ్ని మ్యారేజ్ చేసుకున్నారు.
భార్యల ద్వారా మోసపోయిన క్రికెటర్ల లిస్టులో టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ కూడా ఉన్నాడు. చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను 2007లో పెళ్లి చేసుకున్నాడు దినేష్ కార్తీక్. కానీ వాళ్ల వివాహ బంధం 5 ఏళ్లు మాత్రమే కొనసాగింది. మ్యారేజ్ అయిన కొన్నేళ్లకు కార్తీక్ను మోసం చేసి 2012లో మరో భారత క్రికెటర్ మురళీ విజయ్ను పెళ్లాడింది నికితా వంజార. కార్తీక్-విజయ్లు చాలా మంచి ఫ్రెండ్స్. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇద్దరూ కలసి తమిళనాడుకు ఆడేవారు. అయితే నికిత తనను మోసం చేసి విజయ్ను పెళ్లాడటంతో అతడితో ఉన్న స్నేహానికి ఎండ్కార్డ్ వేశాడు కార్తీక్. ఆ తర్వాత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్తో ప్రేమలో పడ్డాడు. డీకే-దీపికలు 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
శ్రీలంక వెటరన్ ప్లేయర్ తిలకరత్నే దిల్షాన్ కూడా భార్యా బాధితుడే. అతడిది దినేష్ కార్తీక్ను మించిన కథ. దిల్షాన్ ఫస్ట్ వైఫ్ నీలంక వితేజ్ అతడ్ని వదిలి మరో క్రికెటర్ను పెళ్లాడింది. దిల్షాన్ భార్య మ్యారేజ్ చేసుకుంది మరెవర్నో కాదు.. అతడి బ్యాటింగ్ పార్ట్నర్ ఉపుల్ తరంగనే కావడం గమనార్హం. లంక తరఫున తరంగ-దిల్షాన్ కలసి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. జట్టు ఓపెనింగ్ బాధ్యతను చాన్నాళ్లపాటు మోశారు. వీళ్లిద్దరూ ప్రాణస్నేహితులు కావడం విశేషం. అయితే తన భార్యతో తరంగ రిలేషన్ గురించి తెలియడంతో దిల్షాన్ తట్టుకోలేక అతడికి దూరమయ్యాడు. ఇక, నీలంక నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మంజుల తిలిని అనే నటిని దిల్షాన్ పెళ్లాడాడు. అయితే మొదటి భార్య మోసం చేయడంతో దిల్షాన్ తన కొడుకును కూడా దత్తత తీసుకోలేదు. అతడి కుమారుడు తరంగ-నీలంకతో కలసి ఉంటున్నాడు.