ఇద్దరూ గొప్ప క్రికెటర్లు. ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్న బ్యాటర్లు. జట్టును ముందుండి నడిపించగల బెస్ట్ కెప్టెన్లు. ఎన్నో మ్యాచ్లు కలిసి ఆడారు. ఐపీఎల్లో ప్రత్యర్థులుగా కూడా చాలా మ్యాచ్లు ఆడారు. కాగా ఐపీఎల్ 2021 రెండో దశలో శుక్రవారం జరిగే మ్యాచ్తో ఒక అరుదైన పోటీకి ముగింపు పడే చాన్స్ ఉంది. అదేంటంటే.. ఇద్దరూ కెప్టెన్లుగా ఉండి పోటీ పడే అవకాశం మళ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ అనంతరం ఆర్సీబీ టీం కెప్టెన్గా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సీజన్లో సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ చివరి మ్యాచ్. ఒక వేళ రెండు జట్లు ఫ్లేఆఫ్లో లేదా ఫైనల్లో తలపడితే తప్ప కెప్టెన్లుగా ధోని, కోహ్లీ ఒకే మ్యాచ్లో మళ్లీ చూడలేం. ఈ రెండు జట్లలో ఏ ఒక్క జట్టు ఫ్లేఆఫ్ కు చేరకున్నా ధోని, కోహ్లీ కెప్లెన్లుగా తలపడే అవకాశమే లేదు. ఇప్పటి వరకు సీఎస్కే, ఆర్సీబీ 27 మ్యాచ్లలో పోటీ పడితే 17 సార్లు సీఎస్కే పై చేయి సాధిస్తే, ఆర్సీబీ 9 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ధోని 196 మ్యాచ్లకు(చెన్నైజట్టు, 2016-17లో రైసింగ్ పూణె కలిపి) కెప్టెన్గా వ్యవహరించాడు.
అందులో 116 మ్యాచ్ల్లో విజయం, 79 మ్యాచ్లలో పరాజయం చవిచూశాడు. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. కోహ్లీ 132(ఆర్సీబీ) మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరిస్తే 60 విజయాలు, 65 పరాజయాలు పొందాడు. 4 మ్యాచ్లు టై అయ్యాయి. ఈ రెండు జట్లు కూడా ఫ్లేఆఫ్కు అర్హత సాధించి మరో సారి ఈ మేటి ఆటగాళ్లు కెప్లెన్లుగా పోటీ పడాలని వాళ్ల వాళ్ల అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్లలో తెలియజేయండి.