గత కొన్ని రోజులుగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు వరుస విజయాలు అందుకుంటూ.. బంగారు పతకాలు సాధిస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ గుజరాత్కు చెందిన భవినా పటేల్ బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్స్లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో భవినా పటేల్ గెలుపొందింది. 12-10 11-2 11-9తో తన అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. అంతేకాదు భవినా పటేల్ టీటీ విభాగంలో భారత తరఫున గోల్డ్ సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. సోనాల్బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో కాంస్యం పతకం సాధించి భారత్కు మరో పతకాన్ని అందించారు. దీంతో కామన్వెల్త్లో భారత పతకాల సంఖ్య 40కి చేరింది. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి.
ఇక భవినా పటేల్ విషయానికి వస్తే.. 2011 పీటీటీ థాయ్లాండ్ ఓపెన్లో వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని గెల్చుకోవడంతో ఆమె ప్రపంచ నంబర్ 2 ర్యాంకింగ్కు చేరుకున్నారు. ఆ తర్వాత 2013లో బీజింగ్లో జరిగిన ఆసియా పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ క్లాస్ 4లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈసారి ఏకంగా ఏకంగా కామన్వెల్త్ గేమ్స్ 2022 లో స్వర్ణ పతకం సాదించారు. గోల్డ్ మెడల్ గెలిచిన భావినాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bhavina Patel continues to shine with her exemplary performances! Many congratulations to her for winning a Gold Medal in Women’s Singles Para Table Tennis event at #CWG2022. She is truly an inspiration to all. May she continue to bring glory to the nation. #Cheer4India pic.twitter.com/g4BnGMjJwm
— Vice President of India (@VPSecretariat) August 7, 2022