గత కొన్ని రోజులుగా బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు వరుస విజయాలు అందుకుంటూ.. బంగారు పతకాలు సాధిస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ గుజరాత్కు చెందిన భవినా పటేల్ బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ క్లాస్ 3-5 కేటగిరీలో స్వర్ణం గెలుచుకొని చరిత్ర సృష్టించింది. పారా టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్స్లో నైజీరియాకు చెందిన క్రిస్టియానాపై 3-0తో భవినా పటేల్ గెలుపొందింది. 12-10 […]