బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రెండో సెషన్ తర్వాత టీమిండియా బ్యాటర్ జడేజా, ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరిగా పోట్లాడుతున్నాయి. తొలిరోజు టీమిండియా పై చేయి సాధిస్తే.. రెండో రోజు సత్తా చాటుతోంది. ఇక ఆసిస్ ను తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం బ్యాటింగ్ లో తడబడింది. ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ దెబ్బకు భారత టాపార్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆసిస్ ఆటగాడు స్టీవ్ స్మిత్-జడేజా మధ్య జరిగింది.
ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్.. స్లెడ్జింగ్ కు పెట్టింది పేరు. ఏ దేశానికైతే వారు పర్యటనకు వెళ్తున్నారో.. అక్కడి వెళ్లే ముందే తమ మాటలతో ప్రత్యర్థి టీమ్ ను మానసికంగా దెబ్బకొట్టాలను చూస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా ఆసిస్ కు ఉంది. అలాంటిది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసిస్ ఆటగాళ్ల నుంచి ఊహించని పరిణామం ఒకటి చోటుచేసుకుంది. తాజాగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇరు జట్లు పోటా పోటీగా ఆడుతున్నాయి. నువ్వానేనా అన్నట్లుగా ఈ టెస్ట్ సాగుతోంది. అయితే రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
53 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఆదుకునే ప్రయత్నం చేశారు. వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ.. సమర్థవంతంగా ఆసిస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. వీరిద్దరు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో సెకండ్ సెషన్ తర్వాత ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 40 వ ఓవర్ లో ఆసిస్ బౌలర్ వేసిన చివరి బంతిని కవర్స్ మీదుగా కొట్టాడు జడేజా. దాంతో సింగిల్ రన్ వచ్చింది. అయితే రెండో రన్ కోసం జడేజా ప్రయత్నించగా.. కోహ్లి వద్దన్నాడు. దాంతో జడేజా చేసేది ఏమీ లేక క్రీజ్ లోకి ఫాస్ట్ గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలోనే ఫాస్ట్ గా రివర్స్ పరిగెత్తిన జడేజా బ్యాలెన్స్ ఆపుకోలేక స్మిత్ ను పట్టుకున్నాడు. దాంతో స్మిత్ కూడా జడేజాని హగ్ చేసుకుని భూజాం తట్టాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి నవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎప్పుడు స్లెడ్జింగ్ చేసే ఆసిస్ ప్లేయర్స్ లో ఈ కోణం కూడా ఉందా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి 55 రన్స్ వెనకబడి ఉంది. రవిచంద్రన్ అశ్విన్ (25), అక్షర్ పటేల్(35) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
— cricket fan (@cricketfanvideo) February 18, 2023