టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పదిరోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ జరగ్గా అందులో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్దమైపోయింది. ఇక ఇప్పుడు ముంబయిలోని అంబానీ ఆస్పత్రిలో పంత్ చికిత్స తీసుకుంటున్నాడు. గత శుక్రవారమే కుడి మోకాలి లిగ్మెంట్ కు సర్జరీ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఇలాంటి టైంలో బీసీసీఐ పంత్ కు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం అది కాస్త పంత్ తోపాటు అతడి ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యేలా చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ కోలుకోవడానికి ఆరు నెలల కంటే ఎక్కువ టైం పట్టొచ్చు. దీన్నిబట్టి చూసుకుంటే సెప్టెంబరులో జరిగే ఆసియాకప్ తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా మిస్ అయ్యే ఛాన్సులున్నాయి. ధోనీ వారసుడిగా పంత్ ని భావించి, అతడిని బీసీసీఐ తీర్చిదిద్దుతూ వస్తుంది. ఇలా ఇప్పుడు సడన్ గా యాక్సిడెంట్ అయినాసరే పంత్ కు బోర్డు అండగా నిలుస్తుంది. అందులో భాగంగానే ఐపీఎల్ కాంట్రాక్ట్ మొత్తం డబ్బులు అతడికి ఇచ్చేయాలని ఫిక్సయింది. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
గాయం కారణంగా రిషభ్ పంత్.. ఈ ఏడాది ఐపీఎల్ కు దూరమయ్యాడు. ఒక్క మ్యాచ్ ఆడకపోయినా సరే అతడికి పూర్తి వేతనం అంటే.. రూ.16 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రూ.5 కోట్లతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పంత్ కు.. పూర్తి డబ్బులు ఇవ్వాలని ఫిక్సయింది. బీసీసీఐ జాతీయ కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్లందరికీ బీమా వర్తిస్తుంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు గాయం కారణంగా టోర్నీకి దూరమైతే ఆ మొత్తాన్ని ఫ్రాంచైజీలకు బదులు బోర్డే చెల్లిస్తుంది. ఆ తర్వాత బీమా కంపెనీ.. ఆ డబ్బుని బీసీసీఐకి అందజేస్తుంది. ఈ క్రమంలోనే పంత్ కు ఆ డబ్బులివ్వాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది. మరి పంత్ యాక్సిడెంట్, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#RishabhPant Will Get Full Salary.#IPL #ipl2022 #IPL2023 pic.twitter.com/Hq8t0dy4HF
— WebHubUpdate (@WebHub69update) January 8, 2023